Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దిల్ రాజుతో భయంకరంగా గొడవపడిన సిద్దార్ద
దిల్ రాజుతో భయంకరంగా గొడవ పడ్డాను. అయితే అది 'ఓ మై ఫ్రెండ్" సినిమా బాగా రావటం కోసమే అంటున్నాడు సిద్దార్ద. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా 'దిల్" రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్" గతవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ సిద్దార్ధ ఇలా స్పందించారు. అలాగే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సినిమా ఐదు రోజులు హౌస్ఫుల్ కావడమే గొప్ప. 'ఓ మై ఫ్రెండ్" యువతరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడిప్పుడే కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అన్ని సినిమాలూ 'బొమ్మరిల్లు" కాలేవు. దేనికదే ప్రత్యేకం అన్నారు సిద్దార్థ్. ఇక తాను ఈ చిత్రంలో కాలేజ్ అబ్బాయిగా కనపడాలని దర్శకుడు చెపితే కొంచెం ఇబ్బంది పడ్డాను. తన కాన్ఫిడెన్స్ చూసి ఓకే చెప్పా.
ఇలాంటి సినిమా తీయడం సాహసమని అల్లు అరవింద్ మెచ్చుకున్నారు. నవదీప్, శృతి హాసన్, హన్సికతో కలిసి నటించడం హ్యాపీ అనిపించింది. 'దిల్" రాజుతో ప్రతి ఏటా ఓ సినిమా చేయాలని ఉంది. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అన్నారు. ''ఓ మై ఫ్రెండ్' చిత్రం నాతో చేయాలని వేణు శ్రీరామ్ రెండు సంవత్సరాలు ఎదురుచూశారు. ఆయన అనుకున్నది తెరపై చూపించారు. బొమ్మరిల్లు చిత్రంలో సిద్ధు కంటే ఈ చిత్రంలోని చందూయే యువకుడిలా కనిపించాడనే మాట నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాలు సినిమాకి ప్రాణం పోశాయి అని చెప్పారు.