twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛేతన్ భగత్ '2 స్టేట్స్' నవల సినిమాగా...

    By Srikanya
    |

    అమీర్ ఖాన్ రీసెంట్ హిట్ "త్రీ ఇడియట్స్" కు మాలమైన నవల "ఫైవ్ పాయింట్ సమ్ వన్" రచయిత ఛేతన్ భగత్ మరో సారి వార్తల్లోకి వచ్చారు. ఆయన మరో పిక్షన్ నవల "2 స్టేట్స్" ఆధారంగా మరో చిత్రం రూపొందుతోంది. ఈ విషయాన్ని ఛేతన్ భగత్ ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేస్తూ..."2 స్టేట్స్" డీల్ పూర్తయింది. ఈ నవల త్వరలో సినిమా గా రూపొందనుంది. సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో సాజిద్ నడియవాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు అన్నారు. ఇక కథలో హీరో క్రిష్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తారు. వచ్చే సంవత్సంరం ఈ చిత్రం ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని పెద్ద ప్యామిలీ ఎంటర్టైనర్ గా మారుస్తానని దర్శక, నిర్మాతలు హామీ ఇచ్చారు. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అన్నారు.

    ఇక దర్శకుడుగా సిద్దార్ధ ఆనంద్ లేటెస్ట్ చిత్రం అంజానా అంజాని. ఇక ఈ చిత్రం స్క్రిప్టుపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని, అలాగే రైట్స్ కోసం నిర్మాత మంచి మొత్తాన్నే ఖర్చు పెట్టాడని వినికిడి. ఇక ఈ నవల కథ ప్రధానంగా..ఇండియాలోని రెండు వేర్వేరు రాష్ట్రాల, సంస్కృతిల నేపధ్యంలో ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. కథలో కీలక పాత్రధారులు క్రిష్, అనన్య, వాళ్ళు వేర్వేరు రాష్ట్రాలకు, సంస్కృతిలకు చెందినవారు. వారు తమ తల్లి తండ్రలను ఎలా ఒప్పించి ఒకటయ్యారనేది కామిడీ ట్రీట్మెంట్ తో సాగుతుంది. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎన్నికైనట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X