Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఛేతన్ భగత్ '2 స్టేట్స్' నవల సినిమాగా...
అమీర్ ఖాన్ రీసెంట్ హిట్ "త్రీ ఇడియట్స్" కు మాలమైన నవల "ఫైవ్ పాయింట్ సమ్ వన్" రచయిత ఛేతన్ భగత్ మరో సారి వార్తల్లోకి వచ్చారు. ఆయన మరో పిక్షన్ నవల "2 స్టేట్స్" ఆధారంగా మరో చిత్రం రూపొందుతోంది. ఈ విషయాన్ని ఛేతన్ భగత్ ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేస్తూ..."2 స్టేట్స్" డీల్ పూర్తయింది. ఈ నవల త్వరలో సినిమా గా రూపొందనుంది. సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో సాజిద్ నడియవాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు అన్నారు. ఇక కథలో హీరో క్రిష్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తారు. వచ్చే సంవత్సంరం ఈ చిత్రం ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రాన్ని పెద్ద ప్యామిలీ ఎంటర్టైనర్ గా మారుస్తానని దర్శక, నిర్మాతలు హామీ ఇచ్చారు. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అన్నారు.
ఇక దర్శకుడుగా సిద్దార్ధ ఆనంద్ లేటెస్ట్ చిత్రం అంజానా అంజాని. ఇక ఈ చిత్రం స్క్రిప్టుపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని, అలాగే రైట్స్ కోసం నిర్మాత మంచి మొత్తాన్నే ఖర్చు పెట్టాడని వినికిడి. ఇక ఈ నవల కథ ప్రధానంగా..ఇండియాలోని రెండు వేర్వేరు రాష్ట్రాల, సంస్కృతిల నేపధ్యంలో ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. కథలో కీలక పాత్రధారులు క్రిష్, అనన్య, వాళ్ళు వేర్వేరు రాష్ట్రాలకు, సంస్కృతిలకు చెందినవారు. వారు తమ తల్లి తండ్రలను ఎలా ఒప్పించి ఒకటయ్యారనేది కామిడీ ట్రీట్మెంట్ తో సాగుతుంది. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎన్నికైనట్లు సమాచారం.