Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
11-11-11పై కన్నేసిన సిద్ధార్థ, దిల్ రాజు
సిద్ధార్థ, శృతి హాసన్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో 'ఓ మై ఫ్రెండ్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను 11-11-11 తేదీనాడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూంది. ఈ తేదీ రోజున విడుదల చేస్తే సినిమాకు కలిసొస్తుందని, ఇలాంటి తేదీ వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కనుక సినిమా వంద రోజులు ఆడుతుందని వారి నమ్మకమట.
ఓ మై ఫ్రెండ్ సినిమా ఒక సున్నితమైన రొమాంటిక్ ప్రేమకథ ఆధారంగా రూపొందిస్తున్నారు. సిద్ధార్థ సరసన శృతి హాసన్ నటిస్తుండగా...నవదీప్-హన్సిక మరో ప్రధానమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆడియోనే ఈ రోజు(అక్టోబర్ 15) శిల్పకళా వేదికలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరి 11-11-11 తేదీపై నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు-సిద్ధార్థల నమ్మకం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.