Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిద్దార్ద 'ఓ మై ప్రెండ్' రిలీజ్ ఎప్పుడంటే...
సిద్దార్ద హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం నవంబర్ లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం ఆడియో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ ట్రాక్ ని ఎఫ్ ఎమ్ రేడియోలో ఫర్మల్ గా అక్టోబర్ ఎనిమిదవ తేదిన విడుదల చేసారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. చాలా వరకూ నా చిత్రాలు అన్నీ మ్యూజికల్ హిట్సే. అలాగే ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి ఛార్ట్ బస్టర్ లో టాప్ గా ఉంటాయని ష్యూర్ గా చెప్పగలను. మా దర్శకుడు వేణు శ్రీరామ్ మంచి ట్యూన్స్ ని సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ నుంచి తీసుకున్నారు అన్నారు. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ... నేను అతని పాటలను వెబ్ లో విని ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేసాను.సిద్దార్ధ,శృతి హాసన్ ఈ కథకు ఎస్సెట్ అన్నారు.
ఇక సిద్ధార్థ, శృతి హాసన్, హన్సిక, నవదీప్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. నేడు యువతలో ఉన్న కన్ఫ్యూజన్స్, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కలగలిపి వేణు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత మా సంస్థలో సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ఇది. అతను మంచి నటుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం శృతి హాసన్ కొట్టేస్తుంది అంటున్నారు దిల్ రాజు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్పెట్టి నటించాడు. శ్రుతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు'' అని చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.