Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్...ఇప్పుడు సిద్దార్ద
హైదరాబాద్: ఒకే టైటిల్ మూడు తరాలుగా పరిశ్రమలో ప్రయాణం చేస్తోంది. అది మరేదో కాదు .. 'చిక్కడు దొరకడు'. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత కాలంలో రాజేంద్రప్రసాద్ చేస్తే ఇప్పుడు అదే టైటిల్ తో సిద్దార్ద వస్తున్నారు. సిద్దార్ద హీరోగా పిజ్జా దర్శకుడు రూపొందిస్తున్న చిత్రానికి తెలుగు టైటిల్ గా 'చిక్కడు దొరకడు' ని ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల చేసారు.
ఇందులో దర్శకుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి మదురై యువకుడిగా ఎలా అయ్యాడని అనుకుంటున్నారా? సినిమా దర్శకత్వం కోసం మదురై వెళ్లే సిద్ధార్థ్ అక్కడ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటాడు. తన వృత్తిని పక్కనబెట్టి పక్కా మదురై యువకుడిగా మారి ఎలా పోరాడాడన్నదే కథాంశం. మాస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని యూనిట్ చెబుతోంది.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ... ''సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ యాక్షన్, డ్రామా సమ్మిళితంగా చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను'' అని తెలిపారు. ఫైవ్ స్టార్ మూవీస్ బ్యానర్పై ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం తన కెరీర్ లో మరో మలుపు అవుతుందని సిద్దార్ద చెప్తున్నారు. నిర్మాత కథిరేశన్ మాట్లాడుతూ... ''సిద్ధార్థ హీరోగా తమిళ, తెలుగుభాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే మెగా ప్రాజెక్టుకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తారు. చిత్రంలో ఇతర తారాగణం ఇంకా ఖరారు కాలేదు'' అని అన్నారు.
వరసగా డబ్బింగ్ సినిమాలు అందిస్తూ టేస్ట్ ఉన్న నిర్మాతగా ఎదుగుతున్న సురేష్ కొండేటి మరో చిత్రం డబ్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. పిజ్జా సినిమాతో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న జిగర్తతండా అనే సినిమాను ఎస్.కె. పిక్చర్స్, వియస్ఆర్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను తెలుగు వారికి అందిస్తున్నారు. సిద్ధార్థ్, లక్ష్మీ మీనన్ లు నటిస్తున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ మినహా పూర్తయింది.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో సీ సినిమాను రూపొందిస్తున్నాము. సిద్ధార్థ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాము అని చెప్పారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూతొలి చిత్రం పిజ్జా తో కార్తిక్ సుబ్బరాజు మంచి దర్శకునిగా నిరూపించుకున్నారు. మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నగర నేపధ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. యువతరాన్ని ఆకట్టుకునే కథ మా కాంబినేషన్ లో వచ్చిన పిజ్జా ఘనవిజం సాధించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ సినిమాను చేయడం ఆనందంగా ఉంది వేసవి లో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.