కత్రినా గౌనులోకి చెయ్యి దూర్చాడు!(ఫోటోల దుమారం)
ముంబై : బాలీవుడ్ హాట్ హీరోయిన్, ఆసియా సెక్సియొస్ట్ ఉమన్ కత్రినా కైఫ్ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. తాజాగా కత్రినా, సిద్ధార్థ మాల్యాలకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలయంలో దుమారం రేపుతున్నాయి. సిద్ధార్థ మాల్యా కత్రినాను హగ్ చేసుకున్నప్పుడు అతని చెయ్యి కత్రినా గౌనులోకి దూర్చడం చర్చనీయాంశం అయింది.
ఈ ఫోటోలు కొన్నిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా జరిగిన పార్టీ సంబంధించినవని తెలుస్తోంది. ఇంతకాలం ఎక్కడా కనిపించని ఈ ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మాల్యా లాంటి ధనవంతుడి పుత్రరత్నం అయిన సిద్ధార్థ మాల్యా సినిమా రంగంతో అసలు సంబంధం లేకున్నా వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు.
ఆ మధ్య సిద్దార్థ మాల్యా దీపిక పడుకొనె లాంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో సన్నితంగా మెలగడం... ఏకంగా క్రికెట్ స్టేడియాల్లోనే పబ్లిగ్గా కిస్సింగులు, హగ్గింగులు లాంటివి చేయడంతో ఆమె సిద్దార్థ ప్రేమాయణం చేస్తున్నాడని, సహజీవనం చేస్తున్నాడనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కత్రినాతో సిద్ధార్థ సాన్నిహిత్యం
దేశంలోని ధనవంతులైన వ్యాపార వేత్తల్లో ఒరకరైన విజయ్ మాల్యా కుమారుడైన సిద్ధార్థ మాల్యా సినీ రంగంలోని సెలబ్రిటీలతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో ఐపీఎల్ పార్టీల్లో వారికి మరింత క్లోజ్ అయ్యాడు.

చెయ్యి దూర్చేంత సాన్నిహిత్యమా?
ఎంత సాన్నిహిత్యం ఉన్నా మరీ గౌనులోకి చెయ్యి దూర్చేంత సాన్నిహిత్యం ఏమిటి? అని వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. వీరి సన్నిహిత సంబంధాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రణబీర్తోనూ
కత్రినా కైఫ్ గురించి తాజాగా బాలీవుడ్లో వినిపిస్తున్న మరో వార్త....ఆమె రణబీర్ కపూర్ తో నడుపుతున్న ప్రేమాయణం. ఇటీవల వీరిద్దరు విదేశాలకు ఏకాంతంగా గడపటానికి వెళ్లారు. అక్కడ కత్రినా బికినీలు వేసుకుని మరీ అతనితో రొమాన్స్ లో మునిగి తేలింది.

కావాలనే గుట్టు రట్టు చేసారా
కత్రినా-రణబీర్ కలిసి విదేశాల్లో కలిసి గడిపిన ఫోటోలు మీడియాకు లీకయ్యాయి. అయితే ఈ ఫోటోలు కావాలనే లీక్ చేసారనే వాదన కూడా ఉంది. తమ మధ్య ఉన్న సంబంధం గుట్టు రట్టు చేసుకోవడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే ప్రచారం సాగుతోంది.

మీడియాకు కత్రినా కవరింగ్
అయితే కత్రినా మాత్రం మీడియాపై దుమ్మెత్తి పోస్తూ.....కవరింగు ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. మా అనుమతి లేకుండా ఫోటోలు తీసారు, మా పరువును రచ్చకీడ్చారు అంటూ గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. కత్రినా చేస్తున్న ఈ హడావుడి పబ్లిసిటీ స్టంటే అనే వాదన కూడా ఉంది.


Click it and Unblock the Notifications











