Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కీర్తి సురేష్కి మరో అరుదైన గౌరవం.. చిరంజీవిపై ఇంత అభిమానమా?.. వైరల్ పిక్
హీరోయిన్ కీర్తి సురేష్ పేరు దేశ విదేశాల్లో మారు మోగిపోతోంది. 'మహానటి'గా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి అరుదైన గౌరవం పొందుతోంది కీర్తి సురేష్. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా కీర్తించబడిన ఈమె.. తాజాగా సైమా వేడుకలోనూ అదే ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకొని వావ్ అనిపించింది. ఆ వివారాలు చూద్దామా..
అట్టహాసంగా సైమా వేడుక
దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15 నుంచి ఖతార్లోని దోహాలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఎంతో అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా వెళ్లారు.
సౌత్ ఇండియా తారల్లో కెల్లా తెలుగు తారలు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో భాగంగా సౌత్ ఇండియా భాషా చిత్రాల్లో ఉత్తమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా తెలుగు తారల సందడి ఎక్కువగా కనిపించింది. రాధిక, త్రిష, నిధి అగర్వాల్, అనసూయ, పాయల్ రాజ్పుత్ సహా ఎంతో మంది నటీనటులు తళుక్కున మెరిశారు.
మహానటికి గుర్తింపు.. కీర్తి సురేష్ ఖ్యాతి
తాజాగా జరిగిన ఈ సైమా అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి ఎంపిక కాగా.. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కీర్తించబడింది. ఇలా కీర్తి సురేష్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఇటీవలే జాతీయ అవార్డు దక్కడం, ఆ వెంటనే సైమా అవార్డు పొందటం పట్ల కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
చిరంజీవిపై అభిమానాన్ని చాటుకుంటూ
ఇదిలా ఉంటే సైమా అవార్డ్స్ వేడుకలో చిరంజీవిపై కీర్తి సురేష్ చూపిన అభిమానం మెగా ఫ్యాన్స్ని ఆనందంలో ముంచెత్తుతోంది. తెలుగు సినిమా రారాజుగా వెలుగొందుతున్న చిరంజీవి ఎంతో వినమ్రంగా కూర్చొని.. నవ్వుతూ మాట్లాడింది కీర్తి. ఈ పిక్ చూపరులను బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.