Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సీనియర్ నటి ఇంట్లో దొంగతనం..పోలీస్ ధర్యాప్తు
హైదరాబాద్ :ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగి తర్వాత అబ్బాయిగారు వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న నటి జయచిత్ర. తాజాగా జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువును దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీస్ కంప్లైంట్ చేసారు.
వివరాల్లోకి వెలితే... జయచిత్ర చెన్నైలో ని నుంగంబాక్కం, మహాలింగపురంలో నివసిస్తున్నారు. ఈమె తన ఇంటి ఎదుట ఓ వినాయక ఆలయాన్ని నిర్మించారు. సన్నిధిలోని వినాయక విగ్రహానికి 25 కిలోల అలంకరణ వస్తువులను వితరణ చేశారు. పూజలు పూర్తయిన తర్వాత ఈ వెండి వస్తువులను ఆమె తన ఇంటి పూజగదిలో దాచేవారు.
కొన్ని రోజుల కిందట మహాలింగపురంలోని ఇంటికి తాళం వేసి.. నుంగంబాక్కంలోని ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో 24వ తేది నుంచి వెండివస్తువులు కనిపించకుండా పోవడంతో ఆమె శుక్రవారం రాత్రి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పూర్తి వివరాల్లోకి వెళితే...
25 కిలోల వెండి వస్తువుల అపహరణ చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నటి జయచిత్ర ఇంట్లో 25 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె మేనేజర్ గణేష్ చెన్నై నుంగంబాకం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహలింగపురంలోని జయచిత్ర ఇంటిప్రవేశ ద్వారం వద్ద వినాయక ఆలయాన్ని నిర్మించారు.
విశేష దినాల్లో వినాయకుని ప్రత్యేక అలంకరణకు వెండికవచం తదితర సామగ్రిని వినియోగిస్తుంటారు. ఈ ఆలయంలోని పూజారి వెండి వస్తువులను పూజానంతరం ఇంటిలో భద్రం చేస్తారు. సుమారు 9 లక్షల విలువైన ఈ వెండి సామగ్రి కనిపించకుండా పోయాయని ఈనెల 24వ తేదీన గుర్తించారు. సిబ్బందిని, పూజారిని విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.