Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
"ఎన్టీఆర్కు థాంక్స్...పవన్ కళ్యాణ్ అంటే అభిమానం"
హైదరాబాద్: తమిళ హీరో శింబుకు తెలుగులో హీరోగా పెద్దగా కలిసి రాక పోయినా....సింగర్గా తన టాలెంట్ చూపిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రంలో డైమండ్ గాళ్ అనే పాట పాడిన శింబు...పోటుగాడు చిత్రంలోనూ ఓ పాట పాడారు.
ఇటీవల జరిగిన ‘సైమా' అవార్డుల్లో బాద్ షా చిత్రంలోని పాటకు టగాను శింబు ఉత్తమ గాయకుడు అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ, "ఈ పాట పాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎన్టీఆర్ కి, తమన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో అందుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే, తెలుగులో నా అభిమాన నటుడు పవన్ కల్యాణ్. ఆయనకి కూడా ఓ పాట పాడాలనుంది" అన్నాడు.
శింబు సినిమాల విషయానికొస్తే...తన మాజీ ప్రియురాలు నయనతారతో కలిసి పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని