"ఎన్టీఆర్కు థాంక్స్...పవన్ కళ్యాణ్ అంటే అభిమానం"
హైదరాబాద్: తమిళ హీరో శింబుకు తెలుగులో హీరోగా పెద్దగా కలిసి రాక పోయినా....సింగర్గా తన టాలెంట్ చూపిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రంలో డైమండ్ గాళ్ అనే పాట పాడిన శింబు...పోటుగాడు చిత్రంలోనూ ఓ పాట పాడారు.
ఇటీవల జరిగిన ‘సైమా' అవార్డుల్లో బాద్ షా చిత్రంలోని పాటకు టగాను శింబు ఉత్తమ గాయకుడు అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ, "ఈ పాట పాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎన్టీఆర్ కి, తమన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో అందుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. అలాగే, తెలుగులో నా అభిమాన నటుడు పవన్ కల్యాణ్. ఆయనకి కూడా ఓ పాట పాడాలనుంది" అన్నాడు.

శింబు సినిమాల విషయానికొస్తే...తన మాజీ ప్రియురాలు నయనతారతో కలిసి పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని


Click it and Unblock the Notifications











