Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'సింహా' నిర్మాత నెక్ట్స్ మరో నందమూరి హీరోతో..
బాలకృష్ణతో 'సింహా' వంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత పరుచూరి కిరీటి తన తదుపరి చిత్రానికి హీరోగా మరో నందమూరి హీరోని ఎన్నుకున్నారు. అతనెవరో కాదు...కళ్యాణ్ రామ్. ఐతే,అనుకోకుండా ఒకరోజు చిత్రాలతో ఓ సరికొత్త ట్రెండ్ ని ఆవిష్కరించిన యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. యేలేటి ఓ స్క్రిప్టుని వెంకటేష్ కోసం రెడీ చేసారు. కానీ సురేష్ ప్రొడక్షన్ లో లేటవటం, వెంకటేష్ వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో యేలేటి మరో స్క్రిప్టుతో ముందుకొచ్చారు. యాక్షన్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్...తనతో గతంలో అభిమన్యు చిత్రం డైరక్ట్ చేసిన మల్లితో హరేరామ హరే కృష్ణ చిత్రంతో పనిచేస్తున్నారు. శరణ్యామోహన్ హీరోయిన్ గా చేసే ఆ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక యేలేటి..ఒక్కడున్నాడు, ప్రయాణం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ చిత్రంతోనయినా మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటాడని ఆశిద్దాం.