Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
'సింహా' నిర్మాత నెక్ట్స్ మరో నందమూరి హీరోతో..
బాలకృష్ణతో 'సింహా' వంటి సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత పరుచూరి కిరీటి తన తదుపరి చిత్రానికి హీరోగా మరో నందమూరి హీరోని ఎన్నుకున్నారు. అతనెవరో కాదు...కళ్యాణ్ రామ్. ఐతే,అనుకోకుండా ఒకరోజు చిత్రాలతో ఓ సరికొత్త ట్రెండ్ ని ఆవిష్కరించిన యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. యేలేటి ఓ స్క్రిప్టుని వెంకటేష్ కోసం రెడీ చేసారు. కానీ సురేష్ ప్రొడక్షన్ లో లేటవటం, వెంకటేష్ వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో యేలేటి మరో స్క్రిప్టుతో ముందుకొచ్చారు. యాక్షన్ ధ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్...తనతో గతంలో అభిమన్యు చిత్రం డైరక్ట్ చేసిన మల్లితో హరేరామ హరే కృష్ణ చిత్రంతో పనిచేస్తున్నారు. శరణ్యామోహన్ హీరోయిన్ గా చేసే ఆ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక యేలేటి..ఒక్కడున్నాడు, ప్రయాణం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ చిత్రంతోనయినా మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటాడని ఆశిద్దాం.