Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గుంటూరులో సింహా’ గర్జన మారు మ్రోగుతోంది!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మాణంలో యూనైటెడ్ మూవీ బ్యానర్ లో రూపొందిన బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా" లో హింస ఎక్కువైందని, అతి అవధులు దాటిందనీ..సింహా చూసిన ప్రేక్షకులు వారి వారి అభిప్రాయాలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 'సింహా" జోరుని అవేమీ అడ్డుకోలేకపోతున్నాయి. నాలుగు రోజులుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోన్న 'సింహా" ప్రత్యేకించి గుంటూరులో పంజా దెబ్బ చూపిస్తోంది. ఇప్పటికే తొలి రోజు రికార్డుని హస్తగగం చేసుకున్న 'సింహా" ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు మీద కన్నేసింది.
గుంటూరు జిల్లాకి నాలుగు కోట్లు వసూలు చేసి కనీవినీ ఎరుగని రికార్డుని 'మగధీర" నెలకొల్పితే..'సింహా" ఆ దిశగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగురోజలకే ఇంతటి రెస్పాన్స్ ఎప్పుడూ చూడలేదని పలువురు వ్యక్తం చేస్తున్నరు. అనధికార సమాచారం ప్రకారం 'సింహా" ని నాలుగు కోట్లకి అవుట్ రైట్ కొనడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తోంది. అంటే లాంగ్ రన్ లో 'సింహా" నాలుగు కోట్లకు మించి వసూలు చేస్తుందనే అంచనాలు గుంటూరు డిస్ట్రిబ్యూటర్లలో ఉన్నట్టేనని తేలింది. కేవలం కోటి నలభై లక్షల రూపాయలకు గుంటూరు జిల్లా రైట్స్ ని సొంతం చేసుకున్న పంపిణీదారుడు అనూహ్యమైన ఈ స్పందనతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.