Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
12ఏళ్ళ తరువాత తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిమ్రాన్.. యంగ్ హీరోకి తల్లిగా..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మాస్ క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటించిన బ్యూటీ సిమ్రాన్ బగ్గా. దాదాపు తమిళ్, తెలుగులో స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సీనియర్ బ్యూటీ ప్రస్తుతం తమిళ్ లోనే సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించే ప్రయత్నం చేస్తోంది. కానీ తెలుగులో మాత్రం సిమ్రాన్ నటించి చాలా కాలమవుతోంది.
చివరగా 2008లో కృష్ణ భగవాన్ జాన్ అప్పరావ్ 40 ప్లస్.. అనే సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగులో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకో ఒప్పుకోలేదు. ఇకపోతే ఫైనల్ గా సిమ్రాన్ 12 ఏళ్ల తరువాత ఒక తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకుంది.
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కనున్న ఒక సినిమాలో ఆమె తల్లి పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. కొత్త దర్శకుడు సంతోష్ మోహన్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నాడు.
అయితే ఆ సినిమాలో సిమ్రాన్ రాజ్ తరుణ్ కి తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం తమిళ్ సినిమాలనే చేస్తున్న సిమ్రాన్ ఇన్నాళ్లు తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం నచ్చిన పాత్రలు రాకపోవడమేనని తెలుస్తోంది. ఇక రాజ్ తరుణ్ లాక్ డౌన్ అనంతరం తన కొత్త సినిమకు సంబంధించిన షూటింగ్ పనులను స్టార్ట్ చేయనున్నాడు.