Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆడపిల్లను ప్రసవించిన చందమామ సింధూ మీనన్
చందమామలో మంచి ఈజీనెస్ చూపిన సింధూ మీనన్ ఆ తర్వాత తెలుగులో బిజీ కాలేకపోయింది. దాంతో యుకె కి చెందిన బిజెనెస్ మ్యాన్ ప్రభుని లాస్ట్ ఇయిర్ వివాహం చేసుకుంది. రీసెంట్ గా ఓ ఆడపిల్లకు తల్లి అయింది. హాస్పటిల్ లో ప్రసవమైన సింధు, ఆమె బిడ్డ కులాసాగా ఉన్నారు. ఇక సింధూ మీనన్ మొదట శ్రీహరి చిత్రం భధ్రాచలం చిత్రం లో చేసింది. ఆ తర్వాత శివాజీ సరసన 'శ్రీరామ చంద్రులు' చిత్రంలో కనిపించింది. అలా అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చిన ఆమె తన సొంత భాష మళయాళంలోనూ బిజీ కాలేకపోయింది. కెరీర్ చివరి దశలో ఆమె తమిళంలో చేసిన ఈరమ్ చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడంలో చేసిన హూలియా అనే చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆమె చివరగా తెలుగులో చేసిన సుభధ్ర చిత్రం ఇంకా విడుదల కాలేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వంటి కామిడీని గతంలో అందించిన రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీకాంత్ టాకీస్ పతాకంపై ఇ.శ్రీకాంత్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.