Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బెయిల్ పై విడుదలైన సింగనమల
మద్దెలచెర్వు సూరిని హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న భానుకిరణ్తో కలిసి బెదిరింపులకు పాల్పడిన కేసులో నిర్మాత సింగ నమల రమేష్కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు శనివారం ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి రమేష్నేరుగా ఇంటికి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.
షాలిమార్ వీడియోస్ యజమానికి రమేష్ దాదాపు 70 లక్షల వరకు బకాయి పడ్డాడు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా భాను సహాయంతో బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు. భాను అండ ఉన్నంత సేపు రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిన బాధితులు, సూరి హత్య తర్వాత భాను అజ్ఞాతంలోకి వెల్లి పోవడంతో ధైర్యం తెచ్చుకున్నారు.
రమేష్ వల్ల బెదిరింపులకు గురైన షాలిమార్ వీడియోస్ యజమానులతో పాటు, వైజయంతి మూవీస్ యజమానులు పోలీసులకు పిర్యాదు చేశారు. తప్పించుకు తిరుగుతున్న రమేష్ ను పథకం ప్రకారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. బెదిరింపుల కేసులో తప్ప సూరి హత్య కేసులో రమేష్ హస్తం లేదని సీఐడీ విచారణలో తేలింది.