twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పులి, వరుడులతో టెన్షన్

    By Staff
    |

    Mahesh Babu-Pawan Kalyan
    పవన్ కళ్యాణ్ తో పులి, మహేష్ తో వరుడు చిత్రాలు రూపొందించటానికి ప్లాన్ చేసుకున్న శింగనమల రమేష్ ఇప్పుడు తల పట్టుకు కూర్చుంటున్నాడని సమాచారం. ఎందుకంటే రెండూ పెద్ద ప్రాజెక్ట్సే కావటంతో..గబగబా సినిమా పూర్తి చేస్తే బిజెనెస్ చేసుకోవచ్చుననే ఆశ ఉంటుంది. అది ఇప్పుడు సాధ్యమయ్యే పనిలా కనపడటం లేదు. పులి సినిమా కొంత దూరం వెళ్ళి ఆగింది. పవన్ కళ్యాణ్..తన యువరాజ్యం, ప్రజారాజ్యం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ సినిమా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. త్రివిక్రమ్ రేపు, మాపు అంటూ రోజులు గడుపుకొస్తున్నారు. పార్వతీ మిల్టన్ బయిటకెళ్ళింది, అనూష్క ఆ ప్లేస్ లోకి వచ్చిందంటూ వార్తలయితే వస్తున్నాయి.

    కానీ వర్క్ అయితే జరగటం లేదు..అలాగనీ డబ్బు ఖర్చు తప్పటం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే మరో ప్రక్క ప్రపంచం అంతా ఆర్ధిక మాధ్యం తో దెబ్బతింటున్నాయి. మరో ప్రక్క బాలీవుడ్ లో పెద్ద పెద్ద సంస్ధలే సినిమా నిర్మాణాన్ని, బడ్జెట్ ని తగ్గించుకుంటున్నాయి. తెలుగులోనూ వరసగా సినిమాలు రిలీజ్ కావటం ఫ్లాప్ కావటం వరసగా జరిగపోతున్నాయి. హిట్టయిందనుకున్న అరుంధతికి సైతం కలెక్షన్స్ మొల్లిగా తగ్గుతున్నాయని టాక్. ఇలాంటి పొజీషన్ లో ఈ రెండు పెద్ద సినిమాలూ పూర్తి చేసి ఎంత మేరకు బిజెనెస్ చేయగలం, ఏ మేరకు లాభాలు సంపాదించగలం అని ఆయన తన వర్గీయులతో టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. సీనియర్ నిర్మాతలు వీటినుండి రమేష్ ఎలా బయిటపడి గెలుస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X