Don't Miss!
- News మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, మాజీ సీఎం మాస్ వార్నింగ్, నా గురించి తెలుసు కదా !
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Automobiles పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- Sports IPL 2024: ఆర్సీబీ కొంపముంచుతున్న ఫాఫ్ డుప్లెసిస్ చెత్త కెప్టెన్సీ!
- Lifestyle మరణించిన తరువాత జరిగేది అదేనా.. సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతోంది..
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
సింగీతం శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం
హైదరాబాద్ :గోవాలో ఈ నెల 20 నుంచి అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వీటిలో పాల్గొనాల్సిందిగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.
''ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సినీరంగ ప్రముఖులతో ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఒక్కో సెషన్లో ఒక్కో దర్శకుడు విదేశీ ప్రముఖులతో ముచ్చటిస్తారు. దీని కోసం కొంతమంది భారతీయ దర్శకుల్ని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఈ జాబితాలో శ్యామ్ బెనగల్, మధుర్ బండార్కర్ తదితర దర్శకులూ ఉన్నారు. నేను ఈ నెల 25న చర్చాగోష్ఠిలో పాల్గొంటా ను''అని చెప్పారు.
అలాగే ఈ చిత్రోత్సవాల్లో తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'అపూర్వ సహోదరర్గళ్'ని ఈ నెల 24న ప్రదర్శించనున్నట్లు సింగీతం తెలిపారు. నవంబర్ 20వ తేదీ నుంచి కేరళ ఫిలిం ఫెడరేషన్ సంస్థతో కలిసి ఆల్ లైట్స్ ఫిల్మ్ సొసైటీ కేరళలోని గోవాలో పది రోజులపాటు 46వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ను భారీగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ ఫిల్మోత్సవ్లో దాదాపు 34 దేశాల నుండి 131 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. కేరళ రాష్ట్రంలోని 18 ప్రధాన పట్టణాలలో ఈ సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ప్రారంభించనున్నారు. దక్షిణాసియాలోని అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్గా పిలువబడే ఇండీవుడ్ ఫిలిం మార్కెట్ సంస్థ ఈ ఉత్సవానికి ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నారు.
'ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు సినిమా ప్రేమికులు భారీ సంఖ్యలో ఈ ఫిల్మోత్సవ్లో పాల్గొనబోతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యాభైఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ మలయాళ దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్ను ఘనంగా సత్కరించబోతున్నాం. అలాగే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యష్చోప్రాకు ఈ ఉత్సవంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ ఫిల్మోత్సవ్లో 'గోల్డెన్ ఫ్రేం' అవార్డు కోసం 50 చిత్రాలు పోటీ పడుతున్నాయి.
వీటితోపాటు తొలిసారి తీసిన సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా పోటీ ఉంటుంది. ఇరానియన్ దర్శకుడు ఖోశ్రో మాసౌమి నేతృత్య వహిస్తున్న జ్యూరీ ఈ సినిమాలను సమీక్షిస్తుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్గా భారత్ను నిలపాలనే లక్ష్యం దిశగా ఈ ఉత్సవాలను నిర్వహించడం గొప్ప విషయం. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఫిల్మోత్సవ్ను నిర్వహించేందుకు కేరళ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తోంది' అని సంస్థాపక డైరెక్టర్ సోహాన్రారు తెలిపారు. 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదూరి గోపాల్కృష్ణన్కు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఘన సన్మానం ఉన్నాయి.
సింగీతం శ్రీనివాసరావు విషయానికి వస్తే... '2003లో 'సన్నాఫ్ అల్లాడిన్' అనే యానిమేటెడ్ మూవీతో దేశవిదేశాల్లోనూ అలరించారు... ఆ పైన 'వరుడు', 'చిన్నిచిన్ని ఆశ' చిత్రాల్లో నటుడిగానూ కనిపించిన సింగీతం రాబోయే క్రిష్ 'కంచె' సినిమాలోనూ ప్రాధాన్యమున్న పాత్రను పోషించారు.. ప్రస్తుతం 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అనే సినిమా రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.