కొత్త నటీనటులకు సింగితం శ్రీనివాస్ రావు పిలుపు
నాలుగు దశాబ్దాల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాలు అందించిన సింగీతం తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని ఎస్.భారతీకృష్ణ, భారతి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన తారలను పరిచయం చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ ని [email protected]కి పంపవచ్చు. వివరాల కోసం 09032426116 నెంబర్కి కాల్ చేయండి.
ఆ విషయం పక్కన పెడితే...
సింగితం శ్రీనివాసరావు గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలయ్య త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు, సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తన గత సినిమా 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్గా ఆ సినిమా రూపొందబోతోందని, దానికి'ఆదిత్య 999' అనే టైటిల్ పెట్టారని, ఇందులో ఇషా చావ్లాను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఈ వార్తలపై క్లారిటీ రాలేదు. సింగితం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ జీసస్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగినా...అది కూడా ఆచరణకు నోచుకోలేదు.


Click it and Unblock the Notifications












