Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలుగారికి కరోనా వచ్చింది నా వల్ల కాదు.. బాధతో అసలు విషయాన్ని చెప్పిన మాళవిక
ప్రస్తుతం సంగీత ప్రియులను కూడా కరోనా వైరస్ తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. లెజండరీ సింగర్ SP. బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ భారిన పడటంతో ఒక్కసారిగా ఆ న్యూస్ అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఆయన కోలుకుంటున్నారని ఒక వార్త వచ్చిన మరుసటి రోజే పరిస్థితి విషమంగా ఉందని న్యూస్ రావడంతో మరింత భయానికి గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో సింగర్ మాళవిక కారణంగానే బాలుగారు ఆ పరిస్థితుల్లో ఉన్నారని కామెంట్స్ రావడంతో వెంటనే ఆమె వివరణ ఇచ్చారు.
చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు.
మాళవిక మాట్లాడుతూ.. జులై నెలాఖరున రామోజీ ఫిల్మ్ సిటీలో సామజవరగమన అనే ప్రోగ్రామ్ జరిగింది. ఆ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు. నేను జులై 31వ తేదీన పాల్గొన్నాను. నా కంటే ముందే బాలు గారు ఆ ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నారు. నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళ్లడం జరిగింది.
బాలుగారు నాకు ముందే మెస్సేజ్ చేశారు
ఆగస్ట్ 1వ తేదీన బాలుగారు నాకు మెస్సేజ్ చేశారు. నిర్విరామంగా షోలతో బిజీ కావడం వలన చాలా నీరసంగా ఉందని చెప్పారు. ఇక ఆయన ఆగస్ట్ 5వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ ఉందని వీడియో రిలీజ్ చేశారు. దీంతో వెంటనే షోలో పాల్గొన్న అందరూ కూడా టెస్టులు చేయించుకున్నారు. ఆగస్ట్ 8న పాజిటివ్ అని తేలింది.
నా వల్ల కరోనా సోకలేదు
ఇక బాలుగారికి నా వల్ల కరోనా వచ్చిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ప్రోగ్రాం మొదలవ్వక ముందు నేను ఎక్కడికి వెళ్లలేదు. నాకు కరోనా ఉండే అవకాశమే లేదు. దాదాపు 5నెలల నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లలేదు. ప్రోగ్రామ్ నుంచి వచ్చిన తరువాతే మాకు కూడా కరోనా వచ్చింది.
తప్పుడు ప్రచారాలు చేయకండి
ఇంట్లో వాళ్లకు కూడా టెస్టులు చేయించగా మా అమ్మ, నాన్నకు, పాపకు కూడా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దయచేసి ఇలాంటి సమయంలో అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరుకుంటున్నాను.
Recommended Video
సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు
ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం మరోవైపు మా కుటుంబం చాలా బాధలో ఉన్నాము. ఇలాంటి కష్టకాలంలో కరోనా తన వల్లే వచ్చిందని వాట్సాప్ లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. ఇకనైనా దయచేసి ఆ ఫేక్ మెస్సేజ్ ని స్ప్రెడ్ చేయకండి.. అని మాళవిక వివరణ ఇచ్చింది.