Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలుగారికి కరోనా వచ్చింది నా వల్ల కాదు.. బాధతో అసలు విషయాన్ని చెప్పిన మాళవిక
ప్రస్తుతం సంగీత ప్రియులను కూడా కరోనా వైరస్ తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. లెజండరీ సింగర్ SP. బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ భారిన పడటంతో ఒక్కసారిగా ఆ న్యూస్ అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఆయన కోలుకుంటున్నారని ఒక వార్త వచ్చిన మరుసటి రోజే పరిస్థితి విషమంగా ఉందని న్యూస్ రావడంతో మరింత భయానికి గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో సింగర్ మాళవిక కారణంగానే బాలుగారు ఆ పరిస్థితుల్లో ఉన్నారని కామెంట్స్ రావడంతో వెంటనే ఆమె వివరణ ఇచ్చారు.
చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు.
మాళవిక మాట్లాడుతూ.. జులై నెలాఖరున రామోజీ ఫిల్మ్ సిటీలో సామజవరగమన అనే ప్రోగ్రామ్ జరిగింది. ఆ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు. నేను జులై 31వ తేదీన పాల్గొన్నాను. నా కంటే ముందే బాలు గారు ఆ ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నారు. నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళ్లడం జరిగింది.
బాలుగారు నాకు ముందే మెస్సేజ్ చేశారు
ఆగస్ట్ 1వ తేదీన బాలుగారు నాకు మెస్సేజ్ చేశారు. నిర్విరామంగా షోలతో బిజీ కావడం వలన చాలా నీరసంగా ఉందని చెప్పారు. ఇక ఆయన ఆగస్ట్ 5వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ ఉందని వీడియో రిలీజ్ చేశారు. దీంతో వెంటనే షోలో పాల్గొన్న అందరూ కూడా టెస్టులు చేయించుకున్నారు. ఆగస్ట్ 8న పాజిటివ్ అని తేలింది.
నా వల్ల కరోనా సోకలేదు
ఇక బాలుగారికి నా వల్ల కరోనా వచ్చిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ప్రోగ్రాం మొదలవ్వక ముందు నేను ఎక్కడికి వెళ్లలేదు. నాకు కరోనా ఉండే అవకాశమే లేదు. దాదాపు 5నెలల నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లలేదు. ప్రోగ్రామ్ నుంచి వచ్చిన తరువాతే మాకు కూడా కరోనా వచ్చింది.
తప్పుడు ప్రచారాలు చేయకండి
ఇంట్లో వాళ్లకు కూడా టెస్టులు చేయించగా మా అమ్మ, నాన్నకు, పాపకు కూడా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దయచేసి ఇలాంటి సమయంలో అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరుకుంటున్నాను.
Recommended Video
సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు
ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం మరోవైపు మా కుటుంబం చాలా బాధలో ఉన్నాము. ఇలాంటి కష్టకాలంలో కరోనా తన వల్లే వచ్చిందని వాట్సాప్ లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. ఇకనైనా దయచేసి ఆ ఫేక్ మెస్సేజ్ ని స్ప్రెడ్ చేయకండి.. అని మాళవిక వివరణ ఇచ్చింది.