Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గాయని రాధిక మృతి: "బావలు సయ్యా" పాటతో పేరుతెచ్చుకున్న గాయని
"బావలు సయ్యా.. హే మరదలు సయ్యా..." ఆ ఒక్క పాట తోనే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక హఠాన్మరణం చెందారు.
"బావలు సయ్యా.. హే మరదలు సయ్యా..." తెలుగు ఐటం సాంగ్స్ లో ఒక ప్రత్యేక స్ఠానం ఉన్న ఈ పాట వినిపించగానే మరణించిన అందం సిల్క్ స్మిత గుర్తొస్తుంది. అయితే ఆపాటని పాడిన గాయని రాధిక మాత్రం టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. ఆఒక్క పాట తోనే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని రాధిక హఠాన్మరణం చెందారు.
ఎన్నో జనరంజకమైన పాటలను పాడిన ఆమె 47 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అకాలమరణం పొందారు. ఆమె స్వస్థలం తిరుపతి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. 2004 నుంచి సినిమా రంగానికి దూరంగా ఉంటున్న ఆమె చెన్నై పాలవాక్కంలో భర్త, పిల్లలతో కలిసి ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో గుండెపోటుకు గురైన రాధిక తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై సంగీత దర్శకులు కోటి, మణిశర్మ, గాయకులు మనో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పాలవాక్కం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భర్త శశికుమార్ తెలిపారు.