ధనుష్, హన్సిక, త్రిష, అనిరుధ్ ప్రేమాయణాలు...సీక్రెట్ ఫొటోలు లీక్!
తమిళ చిత్ర పరిశ్రమలో గాయని, పాపులర్ టెలివిజన్ యాంకర్ సుచిత్ర మరోసారి దుమారం సృష్టించింది.
తమిళ చిత్ర పరిశ్రమలో గాయని, పాపులర్ టెలివిజన్ యాంకర్ సుచిత్ర మరోసారి దుమారం సృష్టించింది. ధనుష్, హన్సిక, అనిరుధ్ రవిచంద్రన్, అండ్రియా జెర్మియా, దివ్యదర్శినికి సంబంధించిన ప్రైవేట్ పార్టీ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే కారణం తెలియదు కానీ శుక్రవారం రోజే వాటిని తొలగించింది. అంతేకాకుండా తన అకౌంట్ను ప్రైవేట్ స్టేటస్కు మార్చుకొన్నది.

కలకలం రేపుతున్న గాయని సుచిత్ర ట్వీట్లు
తాజాగా సుచిత్ర చేసిన ట్వీట్లు తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి. అత్యంత సన్నిహితంగా ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు సెన్సెషనల్గా మారాయి. ఇటీవల కాలంలో ధనుష్, రేడియో జాకీ ఆర్జే బాలాజీ, సింగర్ చిన్మయి, విజయ్ టీవీ యాంకర్ దివ్యదర్శినిని టార్గెట్గా చేసుకొని సుచిత్ర ట్వీట్లు చేయడం సంచలనం రేపుతున్నది.

ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది
ధనుష్, హన్సిక ఇతర సినీ ప్రముఖుల సీక్రెట్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన వెంటనే తన అకౌంట్ హ్యాక్ గురైందని ట్వీట్ చేయడం గమనార్హం. ఇండస్ట్రీలో తన గురువలతో ఇక గొడవ పడలేదని మరో ట్వీట్లో పేర్కొన్నది.

శృంగారంలో మునిగి తేలిన సినీతారలు
సుచిత్ర చేసి ట్వీట్ చేసిన ఫొటోలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఆండ్రియా మంచి శృంగారంలో మునిగి ఉన్నట్టు కనిపించాయి. ఆమె ట్విట్టర్ నుంచి తొలగించడానికి ముందే వాటిని పలు వెబ్సైట్లు స్క్రీన్ షాట్లు తీసి పబ్లిష్ చేశాయి.

ధనుష్, త్రిషా ఫొటోలు ప్రత్యక్షం
సుచిత్ర చేసిన ట్వీట్లలో ధనుష్, త్రిషా కృష్ణన్ ఫొటోలు కూడా ఉన్నాయి. టీవీ యాంకర్ దివ్యదర్శిని మరో పురుషుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. అనిరుధ్, ఆండ్రియా కలిసి ఉన్న వివాదాస్పద ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత ధనుష్, త్రిషా సెల్ఫీ ఫొటో సెన్సేషనల్గా మారాయి.

ట్విట్టర్లో అన్ఫాలో కావోచ్చు..
నన్ను ద్వేషించే వారికి హెచ్చరిక. నచ్చకపోతే ప్లీజ్ ట్విట్టర్లో నన్ను అన్ ఫాలో కావొచ్చు. హ్యాకర్లతోపాటు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఈ విషయంపై నేను ఎవరినీ నిందించను. పోలీసులకు ఫిర్యాదు చేయను అని సుచిత్ర ఓ ట్వీట్లో పేర్కొన్నది.

డైవోర్స్తో ధనుష్కు సంబంధం లేదు
‘నా విడాకులకు హీరో ధనుష్కు సంబంధం లేదు. అది నా భర్త, నాకు సంబంధించిన అంతర్గత విషయం. ఇది వరకే ఈ విషయాన్ని చెప్పాను' అని సుచిత్ర మరో ట్వీట్ చేసింది.

ధనుష్ గ్యాంగ్ దాడి అని ఆరోపణలు
కొద్ది రోజుల క్రితం హీరో ధనుష్పై సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. ధనుష్ గ్యాంగ్ తనపై దాడికి దిగారని, అందుకు సాక్ష్యాలు ఇవే అని చేతికి గాయాలైన ఫొటోలను ట్వీట్ చేసింది. ఆమె ఆరోపణలు తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి.

సమస్యల్లో సుచిత్ర వ్యక్తిగత జీవితం
‘సుచిత్ర వ్యక్తిగత జీవితం సమస్యలో పడింది. దాంతో ఆమె కొందరు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నది. ఒకప్పుడు తనతో సన్నిహితంగా మెలిగిన ఫ్రెండ్స్ను ప్రస్తుతం టార్గెట్ చేస్తున్నది' అని పరిశ్రమకు చెందిన పెద్దలు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











