Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత.. అందుకే అలా చేశామంటూ వివరణ
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకూ కరోనా తన ధాటిని పెంచుకుంటూ పోతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్రం కూడా ప్రకటించింది. ఇలాంటి తరుణంలో ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే తరుణంలో ఇలా మళ్లీ కరోనా దాడి చేస్తోంది.
కఠిన నిబంధనలు..
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మళ్లీ లాక్డౌన్ పెట్టే ఆలోచనలు అయితే ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ కోవిడ్ నిబంధనలు మాత్రం కఠినంగా అమలు పరిచేందుకు చర్యలు మొదలు పెట్టారు. సమావేశాలు, సభలు వంటి వాటిని నిర్వహించకూడదని, ప్రజలు మాస్క్ను కచ్చితంగా ధరించాలని ఆదేశించారు.
మ్యూజికల్ కాన్సర్ట్..
అయితే సినిమా ఈవెంట్లు, మ్యూజికల్ కాన్సర్ట్లు కూడా ఇలాంటి సమయంలో పెట్టడం కరెక్ట్ కాదు. కరోనా కట్టలు తెంచుకుని విజృంభిస్తోన్న తరుణంలో ఇలాంటి ఈవెంట్లను రద్దు చేసుకోవడం మంచిదని కొందరు భావిస్తున్నారు. అలా సునీత కూడా తమ ఈవెంట్ను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది.
క్షమాపణలు..
మార్చి 27న జరగాల్సిన రాక్ స్టార్ ఈవెంట్స్ను రద్దు చేశాం.. మమ్మల్ని క్షమించండి అని సునీత చెప్పుకొచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటివి ఎవ్వరికీ శ్రేయస్కరం కావని భావించి ఈవెంట్ను రద్దు చేశాం.. మీ అందరూ సహాయ సహకారాలు ఇచ్చినందుకు థ్యాంక్స్.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని సునీత చెప్పుకొచ్చింది.
స్పెషల్ ఈవెంట్..
సింగర్ సాకేత్, రమ్య బెహెరా, అనురాగ్ కులకర్ణి, గీతా మాధురి, శ్రీకృష్ణ, సాహితి, రేవంత్ ఇలా టాలీవుడ్ స్టార్ సింగర్స్ అందరి ఆధ్వర్యంలో మణిశర్మ అదిరిపోయే ఈవెంట్ను ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అదంతా తారుమారైంది.