Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కారులో ప్రముఖ సింగర్ మృతదేహం.. నది ఒడ్డున విగత జీవిగా..
సినిమా ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వైశాలి బల్సారా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్ కు చెందిన సింగర్ వైశాలి ఇటీవల కొన్ని పాపులర్ యూట్యూబ్ సాంగ్స్ తో కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఆమె కొన్ని మరాఠీ సినిమాలలో కూడా సాంగ్స్ ద్వారా బిజీ సింగర్ గా మారిపోయింది. ఇక కెరీర్ మంచి ఊపందుకుంటున్న సమయంలోనే ఈ విధంగా సింగర్ మృతి చెందడం వారి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయాలను నెలకొల్పాయి. అసలు వివరాల్లోకి వెళితే..
ఒక నది ఒడ్డున
సింగర్ వైశాలి ఎలా చనిపోయింది అనే విషయంలో అనేక రకాల అనుమానాలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ ప్రాంతానికి వెళుతున్న ఆమె ఒక నది ఒడ్డున కారులో శవమై కనిపించడం అందరినీ షాక్ గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో ఒక నది ఒడ్డున ఒక కారు రెండు గంటలకు పైగా ఆగి ఉండడం స్థానికులు గమనించారు.
బ్యాక్ సీట్లో ఒక మృతదేహం
అయితే కాస్త అనుమానంగా అనిపించడంతో వెంటనే అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు మొదట సీటు భాగంలో కొన్ని వస్తువులు పడటం గమనించారు. అయితే ఆ తర్వాత వెనకాల డోర్ లాక్ ఓపెన్ చేసి చూడక బ్యాక్ సీట్లో ఒక మృతదేహం కనిపించింది.
కుటుంబ సభ్యులకు సమాచారం
డోర్ తీసేటప్పటికీ అక్కడ ఉన్న ఆధారాల సహాయంతో ఆమె సింగర్ వైశాలి బల్సారా అని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమె వైశాలి అని ధ్రువీకరించడంతో వెంటనే మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.
శనివారం నుంచి మిస్సింగ్
అయితే ఈ సింగర్ మృతిపై ప్రస్తుతం అనేక రకాల అనుమానాలు మొదలవుతున్నాయి. ఆమె భర్త హితేష్ కూడా మంచి గాయకుడిగా గుర్తింపును అందుకున్నాడు. ఇద్దరు కలిసి గత కొంతకాలంగా పలు స్టేజ్ షోలతో కూడా బిజీగా మారిపోయారు. అయితే శనివారం రాత్రి రెండు గంటలకు నుంచి తన భార్య కనిపించడం లేదు అని భర్త పోలీసులకు సమాచారం అందించాడు.
అనుమానాలు
ఇక అప్పటినుంచి పోలీసులు వైశాలి కోసం గాలిస్తూ ఉండగా హఠాత్తుగా ఆమె గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో ఒక నది ఒడ్డున కారులో మృతదేవంగా కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక సింగర్ మృతి పట్ల అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులను విచారించి ఎవరి మీద అయినా అనుమానం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సన్నిహితులు అలాగే అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.