Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కోసం..
భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన సింగ్ ఈజ్ కింగ్ చిత్రం త్వరలో సీక్వెల్ రూపం సంతరించుకోనుంది. హీరో, హీరోయిన్స్ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ లతో పాటు విపుల్ షా కూడా ఈ సీక్వెల్ కు పనిచేయనున్నారు. ఈ విషయాన్ని విపుల్ షా మీడియాకు చెపుతూ...'సింగ్ ఈజ్ కింగ్' సీక్వెల్ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇందులోనూ నాయకానాయికలుగా అక్షయ్ కుమార్, కత్రినలనే ఎంపిక చేసుకున్నాం అలాగే 'సింగ్ ఈజ్ కింగ్కు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో ఓ విధమైన అంచనాలుంటాయి. వాటిని అందుకొనేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను. వినోదాత్మకంగా ఉంటుంది. వచ్చే ఏడాది జూన్, జులైల్లో విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అక్కడ హిందీలోనే కాక మన తెలుగులోనూ ఆర్య-2 అంటూ ఓ సీక్వెల్ రంగంలోకి దూకనుంది. ఇప్పటికే విలేజ్ లో వినాయకుడు అంటూ ఓ సీక్వెల్ వచ్చింది.