Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు శిరీష్ ‘కొత్త జంట’ ఫస్ట్ లుక్ ఇదే(ఫోటో)
హైదరాబాద్ :రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్రాజ్ నిర్మించిన 'గౌరవం' సినిమాతో అల్లు శిరీష్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత శిరీష్ 'కొత్త జంట' ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నాడు. ఈరోజుల్లో, బస్టాప్ చిత్రాల ఫేమ్ మారుతి దర్శకుడు. గీతా అర్ట్స్ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్కు జోడీగా ఈ చిత్రంలో 'రొటీన్ లవ్స్టోరీ' ఫేమ్ రెజీనాను ఎంపిక చేశారు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా త్వరలోనే సెట్స్పైకి రానున్నదని సమాచారం. ఈ చిత్రానికి గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
దర్శకుడు మాట్లాడుతూ ''శిరీష్ హావభావాలకు తగిన కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. కొత్తజంటగా శిరీష్, రెజీనా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తారు. నా మూడో చిత్రమే గీతా ఆర్ట్స్ సంస్థలో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది''అన్నారు.
''చాలా మంచి కథ ఇది. శిరీష్ని తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మారుతి. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్.
యూత్ కామెడీ రెడీ చేసిన స్క్ర్రిప్ట్ ని మారుతి వినిపిస్తే వెంటనే అల్లు అరవింద్ ఓకే చేసినట్లు వినపడుతోంది. అయితే మారుతి..గత చిత్రాలలో బూతు బాగా దిట్టించి వదలటం వల్లనే హిట్ సాధించారనే విమర్శ ఉంది. ఈ చిత్రంతో అయినా రెగ్యులర్ రూట్ లోకి వచ్చి క్లీన్ చిత్రాన్ని అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రెజీనా హీరోయిన్ గా చేస్తోంది.
'గౌరవం' విషయానికి వస్తే...ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ నిర్మాతగా రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన విధంగా విజయం సాధించలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లోనూ వర్కవుట్ కాలేదు.