Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'త్రీ ఇడియట్స్'కు మా చిత్రం ఏ మాత్రం తీసిపోదు
పూర్తిగా తెలుగువారితో నిర్మించిన పదహారణాల తెలుగు సినిమా. 'త్రీ ఇడియట్స్'కు మా 'స్నేహగీతం' ఏ మాత్రం తీసిపోదని అందరూ ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు చిత్ర నిర్మాత లగడపాటి శిరీషా శ్రీధర్. 'స్నేహగీతం' చిత్రానికి సంబంధించి ఈ నెల 14న మరో 50 ప్రింట్లను అదనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..."తమ కూతుళ్ళను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి తల్లి, తమ కొడుకుల బాగోగుల మీద శ్రద్ధ ఉన్న ప్రతి తండ్రి, తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు కలిసి చూడాల్సిన చక్కటి కుటుంబకథా చిత్రం మా 'స్నేహగీతం'.
మంచి స్నేహితుడే మంచి భర్త కాగలడన్న సునిశితమైన సంభాషణలను యువతులు చప్పట్లుకొట్టి మెచ్చుకుంటున్నారు.'అని చెప్పుకొచ్చారు. అలాగే "పలు ఇతర సినిమాలు విడుదలయ్యాక చాలా మంది 'కలెక్షన్లు బాగున్నాయి' అనే అంటున్నారు. కానీ మా సినిమాకు మొదటి నుంచి 'సినిమా బాగుంది' అనే మాటే వినిపిస్తుంది. అందరూ కొత్త వారు కాబట్టి మా చిత్రం నిదానంగా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ మౌత్ టాక్ పెరిగే కొద్దీ అనూహ్య స్పందన మొదలైంది. అందుకే ఈ నెల 14 నుంచి మరో 50 ప్రింట్లను అదనంగా పంపుతున్నాం అన్నారు.