twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'త్రీ ఇడియట్స్'కు మా చిత్రం ఏ మాత్రం తీసిపోదు

    By Srikanya
    |

    పూర్తిగా తెలుగువారితో నిర్మించిన పదహారణాల తెలుగు సినిమా. 'త్రీ ఇడియట్స్'కు మా 'స్నేహగీతం' ఏ మాత్రం తీసిపోదని అందరూ ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు చిత్ర నిర్మాత లగడపాటి శిరీషా శ్రీధర్. 'స్నేహగీతం' చిత్రానికి సంబంధించి ఈ నెల 14న మరో 50 ప్రింట్లను అదనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..."తమ కూతుళ్ళను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి తల్లి, తమ కొడుకుల బాగోగుల మీద శ్రద్ధ ఉన్న ప్రతి తండ్రి, తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు కలిసి చూడాల్సిన చక్కటి కుటుంబకథా చిత్రం మా 'స్నేహగీతం'.

    మంచి స్నేహితుడే మంచి భర్త కాగలడన్న సునిశితమైన సంభాషణలను యువతులు చప్పట్లుకొట్టి మెచ్చుకుంటున్నారు.'అని చెప్పుకొచ్చారు. అలాగే "పలు ఇతర సినిమాలు విడుదలయ్యాక చాలా మంది 'కలెక్షన్లు బాగున్నాయి' అనే అంటున్నారు. కానీ మా సినిమాకు మొదటి నుంచి 'సినిమా బాగుంది' అనే మాటే వినిపిస్తుంది. అందరూ కొత్త వారు కాబట్టి మా చిత్రం నిదానంగా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ మౌత్ ‌టాక్ పెరిగే కొద్దీ అనూహ్య స్పందన మొదలైంది. అందుకే ఈ నెల 14 నుంచి మరో 50 ప్రింట్లను అదనంగా పంపుతున్నాం అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X