Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తండ్రి సాహిత్యం...కొడుకు సంగీతం!
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు సాయి, సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లండన్ లోని యూనివర్సిటీలో సంగీతంలో శిక్షణ పొందిన సాయి....వరుణ్ సందేశ్ హీరోగా నటించే 'కుదిరితే కప్పు కాఫీ...వీలైతే నాలుగు మాటలు" చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే సిరివెన్నెల ఈ చిత్రంలో రెండు పాటలను రాస్తున్నారు. 'వినాయకుడు" దర్శకుడు సాయి కిరణ్ అడవి 'మూన్ వాటర్ పిక్చర్స్" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సుమ భట్టాచార్య హీరోయిన్ గా...రమణ సెల్వ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
అలాగే వరుణ్ సందేశ్ హ్యాపీ హ్యాపీగా...అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రియా శరణ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ప్రియాశరణ్ గతంలో ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్దన్(భిళ్లా), ఎమ్.రాజా (హనుమాన్ జంక్షన్)ల వద్ద అసెస్టెంట్ గా పనిచేసారు.