Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
హారిక హాసిని - సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో ఒకేసారి పదికి పైగా సినిమాలు.. స్పీడు మామూలుగా లేదు!
హారిక అండ్ హాసిని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పేర్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మొదట త్రివిక్రమ్ జులాయి సినిమాతో మొదలైన నిర్మాత రాధాకృష్ణ ప్రయాణం ఏకా అదే తరహాలో కొనసాగుతోంది. తర్వాత ఆయన బాటలోనే వారి అబ్బాయి నాగ వంశీ కూడా వరుసగా సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే వరుసగా సినిమాలు నేర్పిస్తున్నారు. ఇక ఈ రెండు సంస్థల కూడా పేర్లు వేరైనా కూడా వర్క్ మాత్రం ఒకే తరహాలో వేగంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంస్థ నుంచి రాబోయే రోజుల్లో దాదాపు పది సినిమాల కంటే ఎక్కువగానే రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
స్వాతిముత్యం
అక్టోబర్ 5వ తేదీన స్వాతిముత్యం అనే సినిమా రాబోతోంది. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇక అలాగే ధనుష్ తో నిర్మించిన సార్ అనే సినిమా ఇదే ఏడాది డిసెంబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. బుట్ట బొమ్మ అనే మరొక సినిమా కూడా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.
త్రివిక్రమ్ మహేష్ ప్రాజెక్ట్
ఇక ఇదే సంస్థలో జులాయి నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మహేష్ బాబు 28వ సినిమాను కూడా వీరితోనే తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇదివరకే ఈ ప్రాజెక్టు మొదలయ్యింది. ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ అయింది. త్వరలోనే మరొక షెడ్యూల్ మొదలుపెట్టి సినిమాను వచ్చేఏడాది మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
యువ హీరోలతో వరుసగా
ఇక ఇదే ఏడది వచ్చిన డీజే టిల్లు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా డీజే ఇల్లు సినిమా షూటింగ్ ను కూడా ఇటీవల మొదలు పెట్టారు. ఇక జాతిరత్నాలు సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టితో సినిమా ప్రకటించిన ఈ సంస్థ ఇటీవల అతనితో కూడా ఒక సినిమాలో మొదలుపెట్టింది. అలాగే వైష్ణవ్ తేజ్ తో కూడా ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు త్రివిక్రమ్ కూడా సహా నిర్మాతగా కొనసాగుతున్నాడు.
బాలయ్య, రవితేజ
ఈ సినిమాలతో పాటు రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద సినిమాలను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. నందమూరి బాలకృష్ణ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగ వంశీ ఇక త్వరలోనే ఒక హిట్ దర్శకుడితో స్క్రిప్ట్ ఫైనల్ చేసి సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇక మరోవైపు రవితేజతో కూడా ఒక సినిమా చేయాలి అని చర్చలు జరుపుతున్నారు.
కొత్త వారితో కూడా..
అలాగే సీతారా బ్యానర్ లో మరికొన్ని చిన్న సినిమాలను కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని నాగావంశీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ సతీమణి సోదరుడు నితిన్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. మరో యువ హీరో సంతోష్ శోభన్ తో కూడా ఒక సినిమా ఫిక్స్ అయింది. అంతేకాకుండా మరి కొంత మంది కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేయాలని ఈ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.