Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బలవంతంగా ఫీజుల వసూళ్లు, వేధింపులు.. బెదిరిస్తున్నారంటూ ప్రైవేట్ స్కూల్పై శివ బాలాజీ ఫిర్యాదు
లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు, నియమాలకు వ్యతిరేకంగా ఫీజలను వసూలు చేస్తున్న స్కూల్స్పై సినీ నటుడు శివ బాలాజీ ఆగ్రహం చేశారు. మణికొండలోని ఓ ప్రైవేట్ స్కూల్పై ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరైన తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆయన మీడియా సమావేశంలో పేర్కొనడం సంచలనం రేపింది. స్కూల్ యాజమన్యంపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
స్కూల్ వ్యతిరేకంగా ప్రచారం
స్కూల్ యాజమాన్యం తీరును తట్టుకోలేక కొంతమంది పేరేంట్స్ ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఆ గ్రూప్లో చిన్న చిన్న సమస్యలను చర్చించుకోవడంపై స్కూల్ యాజమాన్యం అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్కూల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొంటామని స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. ఫీజులు కడితే కట్టండి లేకుంటే ఇంటికి తీసుకెళ్లండి అని శివ బాలాజీ తెలిపారు.
స్కూల్ యాజమాన్యం తీరును వాట్సాప్ గ్రూప్లో
తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి మాట్లాడమని వాళ్లు మెయిల్ పంపారు. అయితే సమస్యలు తీరకపోవడంతోనే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ఈ క్రమంలో స్కూల్ యాజమాన్యంతో మాకు ఉన్న వ్యక్తిగత రిలేషన్తో నా భార్య వారికి మెయిల్ రాసింది. స్కూల్ యాజమాన్యంతో చిన్న సమస్యలు ఉన్నాయని మెయిల్లో తెలిపారు. అయితే దానికి రిప్లై కూడా ఇవ్వలేదు అని శివ బాలాజీ పేర్కొన్నారు.
స్కూల్ యాజమాన్య స్పందన లేదు
గత మూడు నెలలుగా అనేక విషయాలపై స్కూల్ యాజమాన్యంతో పేరెంట్స్ సంప్రదింపులు జరుపుతున్నారు. సమస్యలు అలాగే ఉన్నాయి. స్కూల్ కరస్పాడెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో సమస్యలు పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాం. మా సమస్యలను ఎదుర్కొంటూ మీ స్కూల్లో పిల్లలను చదివించడం కష్టం అందుకు మనం ఓ పరిష్కారం దిశగా ఆలోచిద్దామని సూచిస్తే దానికి కూడా స్పందించలేదు అని శివ బాలాజీ తెలిపారు.
పరీక్షల పేరుతో బలవంతంగా ఫీజుల వసూళ్లు
ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులను బలవంతంగా కట్టించేందుకు ప్రీ మిడ్ టర్మ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. ఫీజులు కట్టించుకొనే ప్లాన్ భాగంగానే ఈ పరీక్షలను పెట్టింది. పేరెంట్స్ అడిగిన డిస్కౌంట్లపై స్పందించలేదు. కాగా, మా పిల్లల ఆన్లైన్ క్లాసులను లింక్ నుంచి డిస్కనెక్ట్ చేశారు. స్కూల్ ఇలా చేస్తామని ఊహించలేదు అని శివబాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు
పిల్లలు భవిష్యత్తో ఆటలాడుకొంటున్నారని, తల్లిదండ్రులను ఫీజుల పేరుతో వేధిస్తున్నారనే ఆరోపణలపై విద్యాశాఖ అధికారులకు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. మా లాంటి పిల్లల పరిస్థితే ఇలా ఉంటే.. లాక్డౌన్ కాలంలో దిగువ, మధ్య తరగతి పిల్లల పరిస్థితి ఏంటనే విధంగా ప్రశ్నించారు. ఫీజుల పేరుతో వేధిస్తున్న పాఠశాలల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి అని శివబాలాజీ అధికారులను రిక్వెస్ట్ చేశారు.