Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
వేణు మాధవ్ను చూసి భోరున విలపించిన శివారెడ్డి.. ఎన్టీఆర్ వద్ద నుంచి అనుబంధమని
Recommended Video
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడిన వేణుమాధవ్.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో యావత్ సినీ, రాజకీయ వర్గాలు కలత చెందాయి. సినీ ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్లో ఉంచారు.
పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి
ఫిలింఛాంబర్లో ఉంచిన వేణుమాధవ్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సినీ తారలు తరలి వస్తున్నారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులంతా వేణుమాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులు, సినీ తారలతో ఫిలింఛాంబర్ ఆవరణ కిటకిటలాడుతోంది.
శివారెడ్డి ఎమోషనల్
వేణు మాధవ్ భౌతికకాయాన్ని సందర్శించిన శివా రెడ్డి ఎమోషన్ అయ్యారు. ''మిమిక్రీలో, సినిమా రంగంలో మంచి పేరుతెచ్చుకున్న వేణు అన్న ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. మిమిక్రీ పరంగా అన్న చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. నన్నెప్పుడూ శివుడు శివుడు అంటూ పిలిచేవారు. సినిమాల్లో కూడా కలిసి నటించాం. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఆయన మరణించడం బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నాడు శివా రెడ్డి.
రాజీవ్ కనకాల భావోద్వేగం
''వేణుమాధవ్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మా తరపు నుంచి వేణు మాధవ్ గారి ఫ్యామిలీకి అండగా ఉండటానికి శాయశక్తులా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం'' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు రాజీవ్ కనకాల.
మురళీ మోహన్ సంతాపం
వేణు మాధవ్ మరణ వార్త వినగానే టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్బ్రాంతి పాలయ్యాం. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారి దగ్గర చేరినప్పటినుంచే వేణుమాధవ్ తో పరిచయం ఉండేదని, అప్పట్లో ఇంకా సినిమాల్లోకి ఆయన రాలేదని అన్నారు సీనియర్ యాక్టర్ మురళీ మోహన్. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అన్నారు మురళీ మోహన్.