Don't Miss!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్, నాగార్జునతో శివాజీ రాజా బిగ్ ప్లాన్.. 2019లో ఎలాగైనా!
మా అసోసియేషన్ కోసం సొంత భవనం నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. సొంత భావన నిర్మాణం కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. ఎక్కువ వ్యవయంతో కూడుకున్న పని కావడం నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది. మా అసోసియేషన్ కు ఎవరు అధ్యక్షులుగా భవన నిర్మాణానికి అవసరమయ్యే నిధులు సేకరించేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ఇటీవల మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో 2019లో మా అసోసియేషన్ భవన నిర్మాణానికి పునాది రాయి వేసి తీరుతామని అన్నారు. ఈ సందర్భంగా శివాజీ రాజా కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
ప్రభాస్, నాగార్జునతో
త్వరలో నిధుల సేకరణ కోసం లండన్ లో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు శివాజీ రాజా తెలిపారు. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రభాస్, నాగార్జునని సంప్రదించినట్లు శివాజీ రాజా తెలిపారు. వారిద్దరూ ఎంతో పాజిటివ్ గా స్పందించారని శివాజీ రాజా అన్నారు. ఏప్రిల్ లో ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు శివాజీ రాజా ప్రకటించబోతున్నారు. నాగార్జున, ప్రభాస్ తో పాటు చాలా మంది స్టార్లని ఈ ఈవెంట్ లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు శివాజీ రాజా తెలిపారు.
గత ఏడాది 3 కోట్లు
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో అమెరికాలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి గాను దాదాపు 3 కోట్ల నిధులు సేకరించినట్లు శివాజీ రాజా తెలిపారు. మహేష్ తో ప్లాన్ చేసిన ఈవెంట్ ఆగిపోయింది. దీని గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించాలి ప్లాన్ చేశాం. కానీ అది దురదృష్టవశాత్తూ ఆగిపోయిందని శివాజీ రాజా అన్నారు. ఇప్పటికి తాము నమ్రతతో టచ్ లోనే ఉన్నట్లు శివాజీ రాజా తెలిపారు.
సేవాకార్యక్రమాలు
మా అసోసియేషన్ తరుపున నిర్వహించే సేవా కార్యక్రమాలకు సాయం అందించేందుకు నమ్రత ముందుకు వచ్చినట్లు శివాజీ రాజా తెలిపారు. ఈ ఏడాది మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు శివాజీ రాజా తెలిపారు. ఇదిలా ఉండగా మా అసోసియేషన్ నిధుల విషయంలో శివాజీ రాజా, నరేష్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివాదాలు సమసిపోవడంతో మళ్ళీ ఒక్కటయ్యారు.
పునాదిరాయి వేస్తాం
ఎప్పటినుంచో కలగానే మిగిలిపోయిన మా అసోసియేషన్ భవన నిర్మాణాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేస్తాం అని శివాజీ రాజా అన్నారు. 2019లో పునాది రాయి వేసి తీరుతాం. ఇప్పటికే ఎందరో ఆర్టిస్టులు తమవంతు నిధులు అందించేందుకు ముందుకు వస్తున్నారని శివాజీ రాజా తెలిపారు. శివాజీ రాజా వరుసగా రెండవసారి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.