Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెంటల్ మదిలో గురించి చెబుతూ.. ఉద్వేగానికి గురైన శివాజీ రాజా
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు.అబద్ధాలు చెప్పను
Recommended Video
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు. అబద్ధాలు చెప్పను. ఏం వున్నా మొహం మీదే చెప్పేస్తాను అని అన్నారు. మెంటల్ మదిలో సినిమా గురించి చెప్తూ చాలా బాగా నటించారు అని చాలా రోజుల తర్వాత నాకు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు అభినందిస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి ఒక కథ దగ్గరకు తీసుకొచ్చినందుకు చిన్నవాడైన వివేక్ కి నా ధన్యవాదాలు.
వివేక్ మా ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే వుంటారు చెప్తూనే వుంటారులే అనుకున్నా కానీ షూటింగ్ వుంది అని చెప్పినప్పుడు ఓకే అనుకుని వెళ్ళినా షూటింగ్ లొకేషన్లో అందరు చిన్న పిల్లలు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు వీళ్లను చూస్తే స్కూల్ కి వెళ్లినట్టు అనిపించింది. పైగా సైలెంట్ ఉంటారు. ఎవ్వరు అల్లరి చెయ్యరు అంటూ సినిమా అనుభవాలను పంచుకుంటూ శివాజీ రాజా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.