Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మెంటల్ మదిలో గురించి చెబుతూ.. ఉద్వేగానికి గురైన శివాజీ రాజా
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు.అబద్ధాలు చెప్పను
Recommended Video
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడను నాకు మాట్లాడటం చేతకాదు. అబద్ధాలు చెప్పను. ఏం వున్నా మొహం మీదే చెప్పేస్తాను అని అన్నారు. మెంటల్ మదిలో సినిమా గురించి చెప్తూ చాలా బాగా నటించారు అని చాలా రోజుల తర్వాత నాకు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు అభినందిస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి ఒక కథ దగ్గరకు తీసుకొచ్చినందుకు చిన్నవాడైన వివేక్ కి నా ధన్యవాదాలు.
వివేక్ మా ఇంటికి వచ్చి కథ చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూనే వుంటారు చెప్తూనే వుంటారులే అనుకున్నా కానీ షూటింగ్ వుంది అని చెప్పినప్పుడు ఓకే అనుకుని వెళ్ళినా షూటింగ్ లొకేషన్లో అందరు చిన్న పిల్లలు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నాకు వీళ్లను చూస్తే స్కూల్ కి వెళ్లినట్టు అనిపించింది. పైగా సైలెంట్ ఉంటారు. ఎవ్వరు అల్లరి చెయ్యరు అంటూ సినిమా అనుభవాలను పంచుకుంటూ శివాజీ రాజా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.