‘ఏం బాబూ లడ్డూ కావాలా’రిలీజ్ డేట్ ఖరారు
ఎం.ఎం.శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల 'ఆదిత్య' ద్వారా ఆడియో మార్కెట్లోకి రిలీజెైంది. ఆడియో సక్సెస్ పై సంగీతదర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ ''ఇటీవల రిలీజెైన ఈ సినిమా ఆడియో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధానంగా భాస్కరభట్ల సాహిత్యం అస్సెట్గా నిలిచింది. అలాగే హీరో శివాజీతో నాకు 7వ సినిమా ఇది. 5పాటలు వెైవిధ్యంగా కుదిరాయి'' అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -''కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. వినోద ప్రధానంగా సాగుతుంది. శ్రీలేఖ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అన్నారు.
ఇక ఈ చిత్రం తన కెరీర్కి ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గాంధీమనోహర్. చిత్రంలోని 'రాణి రాణి రాణి రాణి లోనకెళ్లి వేసుకొచ్చె లంగా ఓణి, రాణి రాణి రాణి రాణి తొంగి తొంగి చూడమంది సింగారాన్ని...' అంటూ రేవంత్ పాడిన పాట సూపర్ హిట్ అయ్యిందన్నారు. అలాగే 'మీ ఆడవాళ్లు ఇంతే మీ ఆడవాళ్లు ఇంతే, అపార్థాలతో కాపురాలనే కాలదన్నుకుని పోతారు, బోడిగుండుతో కోడిగుడ్డుకు కొత్తగ లింకులు పెడతారు' అనే అంటూ మురళి ఆలపించిన పాట సైతం ఆకట్టుకుంటోందన్నారు.
శివాజీ మాట్లాడుతూ 'ఈ చిత్రం టైటిల్ చాలా క్యాచీగా ఉంది. పరిశ్రమలోని పెద్ద కమెడియన్స్ అంతా నటించారు' అన్నారు. ఈ చిత్రంలో రచనామౌర్య, ఎం.ఎస్.నారాయణ, చిత్రంశ్రీను, భావన, జీవా, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: బి.వాసు, నిర్మాత: టి.జనార్ధన్, దర్శకుడు: గాంధీ మనోహర్


Click it and Unblock the Notifications












