కేవలం 17 రోజుల్లో ..‘ఏం బాబు లడ్డూ కావాలా’
హైదరాబాద్ : గాంధీమనోహర్ దర్శకత్వంలో వనితాస్ డ్రీమ్లైన్ పతాకంపై శివాజి, అదితి అగర్వాల్ జంటగా టి.జనార్ధన్ నిర్మిస్తున్న చిత్రం 'ఏం బాబు లడ్డూ కావాలా'. ఈ చిత్రం టాకీ కేవలం 17 రోజుల్లో పినిష్ చేసినట్లు సమాచారం. అలాగే అతి తక్కువ బడ్జెట్ లో అత్యంత క్వాలిటీతో ఈ చిత్రం తయారైందని తెలుస్తోంది. పూర్తి స్ధాయి కామెడీగా తయారైన ఈ చిత్రం గురించి నిర్మాత టి.జనార్ధన్ మాట్లాడుతూ...
''మా చిత్రం ప్రేక్షకులకు తియ్యని లడ్డూలు తిన్నంత ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం కడుపుబ్బా నవ్విస్తుంది''అన్నారు.
శివాజీ, అతిథి అగర్వాల్ జంటగా డ్రీమ్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'ఏం బాబు లడ్డూ కావాలా?'. గాంధీమనోహర్ దర్శకత్వంలో టి.జనార్ధన్, శ్రీ వనిత ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని హంగులు పూర్తిచేసుకుని ఈ సినిమా 21 న విడుదలకు ముస్తాబయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పూర్తి వినోదాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పేరుకు తగ్గట్టే ప్రేక్షకులను నవ్విస్తుందని, ఐదు పాటలు వేటికవే హైలెట్గా నిలిచే ఈ చిత్రంలో రచనావౌర్య పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
హీరో శివాజీ మాట్లాడుతూ "ఇలాంటి సినిమాని ఈవీవీ సత్యనారాయణ తీస్తే వంద రోజులు గ్యారంటీగా ఆడుతుంది. గాంధీ కూడా ఆ తరహాలోనే చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందనే ఫీలింగ్ ఉంది. శ్రీలేఖతో ఇది నాకు ఎనిమిదో సినిమా. భాస్కరభట్ల చాలా చక్కని పాటలు రాశారు. అందుకే ఆడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.
ఏవీఎస్ మాట్లాడుతూ- 2012లో విడుదలైన చిన్న పెద్ద సినిమాలన్నీ కూడా అగ్ర విజయాలను సాధించాయి. ఆ తరహాలోనే మీ ముందుకు రాబోతున్న మరో చిత్రం 'ఏం బాబు లడ్డూ కావాలా'. నేనీ సినిమాలో ఓ మంచి వేషం వేశాను. బాపుగారి శిష్యుడైన గాంధీ మనోహర్ ఆ చిత్రాన్ని అద్భుతంగా రూపుదిద్దాడు. ఆయన గురువుకు ఏమాత్రం తీసిపోలేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సినిమా సాగుతుంది అన్నారు.
ఎమ్మెస్ నారాయణ, చిత్రం శ్రీను, భావన, జీవా, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కెమెరా: బి.హను, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నిర్మాతలు: టి.జనార్ధన్, శ్రీవనిత, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గాంధీ మనోహర్. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: చందక రాజ్కుమార్.


Click it and Unblock the Notifications











