'జగన్మోహిని' నమిత అందాల ఆరబోత గురించి కనువిందైన కథలు విన్పిస్తున్నాయి. నమిత, రాజా నీళ్ళల్లో చేసుకునే ప్రేమాయణం పసందుగా చిత్రీకరించబోతున్నారట. నీళ్ళల్లో ఆకారాల కదలికలు, శబ్దాలు రసికుల పాలిట వరాలు కానున్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను నమిత పోషిస్తోంది, ఈ నీటి ప్రేమాయణం కోసం నమితకు, రాజాకు కొన్ని రోజులపాటు శిక్షణ ఇవ్వవలసి వచ్చిందట. ముంబయిలో మే 10 నుంచి 12 వరకు ఈ దృశ్యాలను చిత్రీకరించనున్నారు. జూన్ చివరి వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కె.విశ్వనాధ్ దర్శకులు.