Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మాకు థియేటర్లు ఇవ్వలేదో రచ్చరచ్చే!
ఈ సంక్రాంతికి మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ హీరోలుగా వస్తున్న భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా ఏకంగా 1100 ప్రింట్లతో విడుదలవుతుంటే, బాడీగార్డు 1000 థియేటర్లను బుక్ చేసుకుంది. ఇక రవితేజ నిప్పు కూడా దాదాగా ఈ రెండు సినిమాలకు అటూ ఇటు ప్రింట్లతో విడుదలవుతోంది. చివరకు తమిళ డబ్బింగ్ సినిమా, విక్రమ్ నటించిన 'వీడింతే' ఈ సంక్రాంతికి వందల సంఖ్యలో థియేటర్ల రిజర్వు చేసుంది. ఈ పెద్ద సినిమాలన్నింటినీ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన బడా నిర్మాతలు సొంతం చేసుకుని, థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకునా ఎక్కువ ప్రింట్లతో విడుదల చేస్తున్నారు.
ఈ పరిణామాలతో చిన్న సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెద్ద నిర్మాతలంతా థియేటర్లను బ్లాక్ చేయడంతో సినిమాలు విడుదల చేసుకోలేని పరిస్థితి. దీంతో చిన్న నిర్మాతలంతా బుధవారం ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. చిన్న సినిమాలకు కూడా తగిన సంఖ్యలో థియేటర్ల కేటాయింపు చేయాలని, థియేటర్ల సమస్య పరిష్కరం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. చిన్న నిర్మాతలతో ఆందోళన విరమింప చేసేందుకు ఫిల్మ్ చాంబర్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.