Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పోలీసుల సాయంతో అన్నదానం.. సింగర్ స్మిత పెద్ద మనసు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వణికిస్తోంది. విరుగుడు లేని ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కరోనా కేసులు నమోదు కాగా అందులో రెండు లక్షలకుపైగా మృతి చెందారు. ఇంతలా విజృంభిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు లాక్ డౌన్ను అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ గత నెలరోజుల నుంచి లాక్ డౌన్ అమల్లోనే ఉంది. దీనివల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఇంకెంతో మంది తినడానికి తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.
అలాంటి వారిని ఆదుకునేందుకు సెలెబ్రిటీలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి ఆపత్కాల సమయంలో సెలెబ్రిలందరూ తమవంతుగా ముందుకు వచ్చి పేదవారి ఆకలిని తీర్చుతున్నారు. ఇప్పటికే గోపీచంద్, ప్రణీత వంటి వారు పేదవారికి ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. తమకు చేతనైన సాయాన్ని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
It was a pleasure meeting you Sajjanar sir @cyberabadpolice & working with your team the last 30 days. Distributed 82360 meals through ur team & now moved to groceries upon you advice. I promise to do whatever I can to help during these crises #COVID19 #TeamAlai #TeamBubbles pic.twitter.com/ZhGCHMWxxo
— Smita (@smitapop) April 28, 2020
తాజాగా సింగర్ స్మిత చేస్తోన్న సాయం గురించి బయటకు వచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సజ్జనార్ సర్ను కలవడం, ఆయన బృందంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. గత నెల రోజులుగా పోలీసు బృందంతో కలిసి ఇప్పటి వరకు 82360 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్టుగా పేర్కొంది. మీ సలహా మేరకు ఇప్పుడు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తానని తెలిపింది. ఇలాంటి విపత్కర సమయంలో తన వంతుగా చేతనైన సాయాన్ని చేస్తానని పేర్కొంది.