Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నమ్మినవాళ్లే మోసం చేశారు..స్నేహా ఉల్లాల్
తనని చాలామంది తప్పుదోవ పట్టించారని, నమ్మినవాళ్లే మోసం చేశారని స్నేహా ఉల్లాల్ ఆరోపిస్తోంది. అయితే ఈ మోసం అనేది తెలుగు పరిశ్రమలో జరగలేదని, హిందీ చిత్ర పరిశ్రమలోనేనని చెప్తోంది. అలాగని ఏ రకమైన మోసమో చెప్పటానికి మాత్రం ఆమె ఇష్టపడటం లేదు. అయితే అది ఆమెలేటెస్ట్ బాలీవుడ్ రిలీజ్ 'క్లిక్' గురించేనన్నది మాత్రం సుస్పష్టం. చాలా గ్యాప్ తర్వాత 'క్లిక్' అనే హిందీ చిత్రంలో చేసానని అయితే అది ఇన్నాళ్ళకు రిలీజ్ అవుతుందని ఊహించలేదని చెప్తోంది. 'క్లిక్' చిత్రం తన చుట్టూ తిరగదని, ఆ పాత్ర తనకు కరెక్ట్ కాదని స్నేహా ఉల్లాల్ పేర్కొన్నారు. ఇక తెలుగు పరిశ్రమ అలా కాదని చెబుతూ.. తెలుగులో నాకు మంచి ఆదరణ లభించింది. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' తర్వాత నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాకు బాలీవుడ్కన్నా నాకు టాలీవుడ్డే బెటర్ అనిపిస్తోంది' అంటోంది స్నేహా ఉల్లాల్. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో చేస్తోంది.