Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
శిల్పా సెట్టి నైట్ క్లబ్ కొనుగోలు చేసిన సొహైల్ ఖాన్
శిల్పా శెట్టి కుంద్రా యాజమాన్యతగల నైట్ క్లబ్ బాగానే నడుస్తున్నట్లు వినికిడి. అయితే, ఈ క్లబ్ ను సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, నిర్మాత అయిన సొహైల్ శిల్పా శెట్టి నుండి కొనేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గతంలో ఈ నైట్ క్లబ్ ను 'పాయిజన్" పేరుతో సంజయ్ దత్ స్నేహితులు కొంతకాలం నడిపారు. స్దానికంగా వీరు నడిపే ఈ క్లబ్ ఒక న్యూసెన్స్ గా మారడంతో అధికార్లు దానిని మూసివేయమని కోరారు. ఇదే సమయంలో శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రా తో కలిసి అందులో ఆర్ధిక భాగస్వామ్యానికి చేరింది. ఇపుడు ఆ వాటాలనే సొహైల్ కొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం, ఈ క్లబ్బు ఫిల్ము షూటింగ్ లకు వాడుతున్నారు. నిర్మాత పహలజ్ నిహ్లాని తన చిత్రానికి అవసరమైన ఒక పాటను ఇందులోనే చిత్రీకరించారు. ఇంతే కాదు, సెప్టెంబర్ ఒకటో తేదీనాడు రిలీజ్ కానున్నసల్మాన్ ఖాన్ నటించిన, 'బాడీ గార్డు" లోని కొన్ని కీలక దృశ్యాలను కూడా అతుల్ అగ్ని హోత్రి దీనిలోనే చిత్రీకరించినట్లు చెపుతున్నారు.