Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి
హైదరాబాద్ : మహేష్ బాబు-క్రిష్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా చేయనుందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను సోనాక్షి స్వయంగా ఖరారు చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబు తెలుగులో తొలి సినిమా చేయబోతున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన క్రిస్... ఈ ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి 'శివం' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం పూర్తయిన తర్వాత మహేష్-క్రిష్ కాంబినేషన్ మొదలు కానుంది. ఇక పోతే క్రిష్ దర్శకత్వం వహించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం బాక్సాఫీసు వద్ద సరైన ఫలితాలను ఇవ్వలేదు.
గతంలో ఓసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు, అతనితో నటించే అవకాశం వస్తే తెలుగులో సినిమా చేయడానికి రెడీ అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. మరి మహేష్ బాబుతో తెలుగు తెరపై అడుగు పెడుతున్న సోనాక్షికి అంతా మంచి జరుగాలని ఆశిద్దాం.