Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ ‘శివం’గురించి మీడియాతో సోనాక్షి
హైదరాబాద్ : త్వరలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మహేష్బాబు, క్రిష్ కాంబినేషన్లో రూపొందనున్న 'శివం' చిత్రానికి హీరోయిన్ గా ఆమె ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా గురించి, ఇందులోని తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడారు సోనాక్షి.
సోనాక్షి మాట్లాడుతూ.... '''శివం' కథ చెప్పడానికి క్రిష్ నా దగ్గరకొచ్చినప్పుడు వినయంగా తిరస్కరిద్దామనుకున్నాను. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో నా డైరీ బిజీగా ఉంది. ఇలాంటి టైమ్లో తెలుగు సినిమా ఒప్పుకోవడం రిస్క్ అనిపించి చేయకూడదనుకున్నాను. ముందు ఓ పది నిమిషాలు కథ వినిపించారు క్రిష్. ఎంతో ఉద్వేగభరితంగా అనిపించింది.
వెంటనే ఆ కథకి కనెక్ట్ అయిపోయాను. ఉత్కంఠను ఆపుకోలేక కథ మొత్తం వివరంగా చెప్పమన్నాను. మూడు గంటల పాటు కథను అద్భుతంగా నారేట్ చేశారు క్రిష్. వండర్ అనిపించింది. ఈ సినిమా వదులుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ ఓ ఎత్తయితే... 'శివం'లో నేను చేయబోతున్న పాత్ర మరో ఎత్తు. నా టాలీవుడ్ ఎంట్రీ మహేష్తో జరగడం ఆనందంగా ఉంది'' అని చెప్పింది సోనాక్షి.
ఇంతకు ముందు కూడా సోనాక్షి ట్విట్టర్ లో... ''అవును. నేను మహేష్తో నటిస్తున్నా. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. అందులో నా పాత్ర ఇంకా బాగా నచ్చింది. తొలిసారి తెలుగులో, అందులోనూ మహేష్ బాబు లాంటి హీరోతో నటించడం ఆనందంగా ఉంది''అని ట్వీట్ చేసింది