జస్టిస్ బీబర్తో సోనాక్షి సిన్హా.. చేరువ కావాలనుకొంటున్నా..
మే 10 తేదీన ముంబైలో జరిగే సంగీత కచేరీలో యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్తో చిందేయనున్నారు.
గతేడాది గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్లో కోల్డ్ప్లే అండ్ జే బ్రిటన్ బ్యాండ్తో జతకట్టిన సోనాక్షి సిన్హా మరో అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకొన్నట్టు తెలుస్తున్నది. మే 10 తేదీన ముంబైలో జరిగే సంగీత కచేరీలో యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్తో చిందేయనున్నారు. అందుకోసం ఓ ప్రోగ్రాంను డిజైన్ చేస్తున్నారని, ఆ వేదికపై దానిని ఆవిష్కరించే అవకాశముందని ప్రముఖ దిన పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఈ అంశంపై సోనాక్షితో చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఈ విషయంపై స్పష్టత రాలేదని బీబర్ కచేరీని నిర్వహిస్తున్న వైట్ ఫాక్స్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సమకాలీన సంగీతం అంటే చాలా ఇష్టం, ప్రపంచ సంగీత అభిమానులకు చేరువ కావాలనుకొంటున్నానని సోనాక్షి తెలిపారు.


Click it and Unblock the Notifications











