Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Sonali Phogat: సోనాలి ఫోగట్ను ఆస్తి కోసమే చంపారా? ఆమె కూతురికి సైతం ప్రాణ హానీ!
బిగ్బాస్ రియాలిటీ షోతో ఎంతోమంది ఫేమస్ అయ్యారు. సెలబ్రిటీ రేంజ్ను సంపాందించుకున్నారు. అలాంటివారిలో సోనాలి ఫోగట్ ఒకరు. హిందీ బిగ్బాస్ 14వ సీజన్ కంటెస్టెంట్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు సోనాలి ఫోగాట్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గోవా ట్రిప్కు వెళ్లిన సోనాలి ఫోగట్ హఠాత్తుగా మరణించడం సంచలనంగా మారింది. ఆమె మరణంపై జరిపిన విచారణ అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు తాజాగా ఆమె మరణం వెనుక ఎవరున్నారు? ఆమెది హత్యేనా? ఎందుకోసం చంపారు? అలాగే ఆమె వారసురాలు యశోధరకు ప్రాణ హాని ఉందా? అనే విషయాలు తెరమీదకు వస్తున్నాయి.
ఎవరున్నారు?
హిందీ బిగ్బాస్ 14వ సీజన్ కంటెస్టెంట్, హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ (43) అనుమానస్పదంగా మరణించడం సంచలనంగా మారింది. ఆమె మృతిపై మిస్టరీ వీడటం లేదు. అనేక మలుపుల తర్వాత ఆమె మరణం హత్యగా నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఇదిలా ఉంటే అసలు సోనాలి ఫోగట్ హత్య వెనుక ఎవరున్నారు? ఎందుకు చంపారన్న విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
రూ. 110 కోట్ల ఆస్తికి వారసురాలు..
ఈ నేపథ్యంలోనే సోనాలి ఫోగట్ను ఆస్తి కోసమే హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సోనాలి ఫోగట్ రూ. 110 కోట్ల విలువైన ఆస్తికి ఆమె కుమార్తే యశోధర వారసురాలు. ఆమెకు కూడా ప్రస్తుతం ప్రాణ హానీ ఉందని ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016లో సోనాలి ఫోగట్ భర్త సంజయ్ ఫోగట్ సైతం ఇదే రీతిలో అనుమానాస్పదంగా మరణించాడు.
యశోధరకు 15 ఏళ్లు..
2016లో సంజయ్ ఫోగట్, ఇప్పుడు సోనాలి ఫోగట్ ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళ చెందుతున్నారు. ఇప్పుడు సోనాలీ కూతుర యశోధరను కూడా హత్య చేయొచ్చని వారు బాధపడుతున్నారు. ప్రస్తుతం యశోధరకు 15 సంవత్సరాలు. ఈమెకు ప్రాణ ముప్పు ఉందన్న కారణంగా యశోధరను తిరిగి హాస్టల్కు పంపించొద్దని కుటుంబీకులు నిర్ణయించారు.
సీబీఐకి అప్పజెప్పాలి..
ఇప్పటికే యశోధరకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు తన తల్లి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని యశోధర డిమాండ్ చేస్తోంది. ''నా తల్లిని ప్లాన్ ప్రకారే హత్య చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవాలో వారం రోజులపాటు షూటింగ్ ఉందని అమ్మ నాతో చెప్పింది. మరి అలాంటప్పుడు రిసార్ట్ను కేవలం రెండు రోజులకే ఎందుకు బుక్ చేశారు? పక్కా పథకం ప్రకారమే అమ్మను హత్య చేశారు.
నేను సంతృప్తిగా లేను..
అయినా ఇప్పటివరకు మా అమ్మ హత్యకు గల కారణాలను పోలీసులు నిర్ధారించలేదు. గోవా పోలీసుల దర్యాప్తు నాకు సంతృప్తికరంగా లేదు. ఈ దర్యాప్తుపై అనేక సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా'' అని సోనాలి ఫోగట్ కుమార్తె యశోధర తెలిపింది. కాగా ఆగస్టు 22న సోనాలి ఫోగట్ తన మేనేజర్ సుధీర్ సాంగ్వాన్తో పాటు మరొకరితో కలిసి గోవాకు వెళ్లిన విషయం తెలిసిందే.