సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ఇకపై!
ఇటీవల మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో ప్రేక్షకుల బయట నుంచి ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేందుకు వీలుగా ఆగష్టు 1 నుంచి నిబంధనలు అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ సర్కార్ కూడా దీనిఫై నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు స్పందించారు. త్వరలోనే సినిమా థియేటర్స్ లోని ప్రేక్షకులు ఆహారపదార్థాలు తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వం నిర్ణయంపై సినీ అభిమానుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. థియేటర్ యాజమాన్యాలు పరిమితికి మించిన ధరలతో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











