Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మహేష్ బాబు స్క్రీన్ అత్త...కోర్టు వివాదాలు
కాగా గత కొన్ని రోజుల క్రితం ముఖేష్ రెండో వివాహం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా తన భర్త రెండో వివాహం చేసుకున్నారని.. ఆయనపై కేసు పెట్టనున్నట్లు సరిత ఆ మధ్య మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అభిప్రాయభేదాల కారణంగా తాను, భర్త వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలిపారు. తన మొదటి కుమారుడు షర్వన్ దుబాయ్లో వైద్య కోర్సు చేస్తున్నాడని, రెండో కుమారుడు తేజస్సు డిగ్రీ చదువుతున్నాడని వివరించారు. వారికి తోడుగా తాను కూడా అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన భర్త ముఖేష్ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై తాను ముఖేష్పై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.
సరిత చెప్పిన వివరాల ప్రకారం... 1988 ముఖేష్ తో సరిత వివాహం కేరళలో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 2007లోనే ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ సరిత కోర్టుకు వెళ్లగా....ముఖేష్ విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత 2009లో పరస్పర అంగీకారంతో కూడిన విడాకులు కోరుతూ చెన్నరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. అయితే ముఖేష్ కోర్టుకు సరిగా హాజరుకాని కారణంగా....ఆమె ఆ పిటీషన్ 2010లో ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం సరిత ఇద్దరు కుమారులు శ్రవణ్, తేజా్ దుబాయ్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారి ఆలనా పాలన చూస్తు వారితో పాటే ఉంటున్నారు సరిత. మరోచరిత్ర, కోకిలమ్మ, అచ్చమిల్త్లె అచ్చమిల్త్లె తదితర చలన చిత్రాల్లో నటించి ఆమె గుర్తింపు పొందారు.