Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం.. కానీ ఇంకా విషమంగానే..
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతుండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి వచ్చిన రూమర్లపై కుమారుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్పందించారు.
ఎస్పీ చరణ్ ఓ వీడియోను రిలీజ్ చేసి.. నాన్న ఆరోగ్యం గురించి తన వద్ద నుంచి సమాచారం వస్తే నిజమని నమ్మండి. మిగితా ఎవరైనా ఏదైనా చెబితే వాటి గురించి పట్టించుకోకండి. నాన్న ఆరోగ్య గురించి వైద్యులు ముందు నాకు మాత్రమే చెబుతారు అంటూ ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు నాతో సోమవారం సాయంత్రం మాట్లాడుతారు. ఆ తర్వాత తాను అధికారికంగా ప్రకటన జారీ చేస్తామని చెప్పారు.
తాజాగా సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. కరోనావైరస్ పాజిటివ్తో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్, ఈసీఎంవో సపోర్ట్పై ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందంగా జాగ్రత్తగా అత్యంత సంరక్షణతో పరిశీలిస్తున్నది అని ఎంజీఎం హాస్పిటల్ హెల్త్ బులెటిన్లో ఉన్నత వైద్యురాలు అనురాధ భాస్కరన్ వెల్లడించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరూ ప్రార్థించండి అంటూ ఎస్పీ బాలు ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.