Don't Miss!
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అలాంటి హీరోయిన్లకే నిర్మాతల ఆఫర్లు.. బాత్రూంలో చేసేటివి చూపిస్తారా?.. బాలు
Recommended Video
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సంప్రదాయలు, సంస్కృతి, ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేసే ఎస్పీ బాలు మరో ముందడుగు వేసి రాజకీయాలను తూర్పార పట్టారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ నిర్మాతలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
భాష మీద తెలుగు వాళ్లకి
భాష మీద అభిమానం, పిపాస లేనిది తెలుగు వాళ్లకే. మిగితా రాష్ట్రాల్లో ఇది కనిపించదు. వారు భాషను అమితంగా ప్రేమిస్తారు. పదాలు పలకడం కూడా రాదు. ఇక భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. టెలివిజన్, ఇతర కార్యక్రమాల్లో మాట్లాడే భాష వింటే మా ప్రాణాలు పోతుంటాయి అని బాలూ పేర్కొన్నారు.
బాత్రూంలో చేసే పనులను
ఎవరైనా ఏమైనా అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తున్నారు కదా అంటారు. వాళ్లు బాత్రూంలో చేసే పనులు చూపిస్తే మనం కూడా అవి చూపించగలమా? మన సంప్రదాయాలు వేరు.. వారి సంప్రదాయాలు వేరు. కాబట్టి మన సంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని బాలు ఆవేదన వ్యక్తం చేశారు.
హీరోయిన్లను చూస్తే మండిపోతుంది
ఏదైనా కార్యక్రమం జరిగితే వేదిక మీదకు వచ్చే హీరోయిన్లను చూస్తే ఒళ్లు మండిపోతుంటుంది. పొట్టి దుస్తులు వేసుకుంటే తప్ప నిర్మాతలు, దర్శకులు ఛాన్స్లిస్తారనుకొంటారేమో నాకు అర్థం కాదు. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి దారుణంగా తయారైంది అంటూ బాలసుబ్రహ్మణం అన్నారు.
వాళ్లకే నిర్మాత ఆఫర్లు
సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోయిన్లకే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. వారి అంగాంగ ప్రదర్శన చూసి హీరోలు, నిర్మాతలు వారికి ఛాన్సులిస్తారు. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను భయపడను. ఏ హీరోయిన్కైనా కోపం వచ్చిన పర్లేదు అని అన్నారు.
మర్డర్లు చేసేవారే పాలిటిక్స్లో
రాజకీయాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. 10, 20 మర్డర్లు చేసి జైలుకుపోయి వచ్చిన వాళ్లే రాజకీయాల్లో కనిపిస్తారు. జైల్లో నుంచే గెలిచి సభల్లోకి వెళుతారు. వారి చేసిన దుర్మార్గాలకు శిక్ష పడితే ఐదారు ఏళ్లలో బయటకు వచ్చేస్తారు. ఎవరైతే బేడీలు వేస్తారో వారితోనే సలాంలు కొట్టించుకొంటారు అని బాలు తీవ్రంగా స్పందించారు.