Don't Miss!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఊహించని అవమానం.. ఆవేదన చెందుతూ పోస్ట్
ఇటీవల జరిగిన మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మీట్లో పలువురు ఉత్తరాది తారలతో పాటు దక్షిణాది తారలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వివరాల్లోకి పోతే..
నరేంద్రమోదీ మీట్.. దక్షిణాది సినీ ప్రముఖుల అసంతృప్తి
మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 29వ తేదీన హిందీ ఫిల్మ్ స్టార్స్తో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొంతమంది సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. అప్పటి నుంచే ఈ మీట్పై దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నుంచి అసహనాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
మోదీ తీరుపై ఉపాసన ట్వీట్.. దిల్ రాజు, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళే..
సౌత్లోని అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసంతృత్తి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి దిల్ రాజు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అదేవిదంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విటర్ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.
రామోజీరావుగారి కారణంగా అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఇదిలా ఉండగానే తాజాగా ఈ సమావేశానికి హాజరైన సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తన స్పందన తెలపడం చర్చనీయాంశంగా మారింది. రామోజీరావుగారి కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని ఎంట్రన్స్ దగ్గర మా ఫోన్లు సెక్యూరిటీ వారికి అప్పగించి వెళ్ళమని అన్నారని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
తీరా లోపలి వెళ్ళాక చూస్తే..
కానీ తామంతా లోపలికి వెళ్ళాక కొంతమంది స్టార్లు మాత్రం ప్రత్యేకంగా ప్రధానితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ సంఘటన చాలా అసంతృప్తిని కలిగించిందని a ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పోస్ట్లో పేర్కొన్నారు. వారిదగ్గర సెల్ ఫోన్స్ ఎలా వచ్చాయి అని అడిగితే వారంతా జాతీయ స్థాయి కావడంతో వారిదగ్గర నుండి సెల్ ఫోన్స్ తీసుకోలేదు అన్న సమాధానం వచ్చిందట. దీంతో ఈ విషయాన్ని అందరి ముందు ఉంచుతూ ఇలా తన అసంతృత్తిని వెళ్లగక్కారు బాలసుబ్రమణ్యం.